వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా సంతాపం: రేపు అధికారిక అంత్యక్రియలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yerrannaidu
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత, ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు మృతి పట్ల ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శుక్రవారం సంతాపం తెలియజేశారు. ఎర్రన్నాయుడు మృతి దేశానికి ఎంతో లోటు అని మన్మోహన్ సింగ్ అన్నారు. కేంద్రమంత్రిగా ఆయన చేసిన సేవలు ఎంతో గుర్తింపు పొందాయని సోనియా గాంధీ ఈ సందర్భంగా చెప్పారు.

ఎర్రన్నాయుడు మృతికి కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, దగ్గుపాటి పురంధేశ్వరి, సిపిఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీతారం ఏచూరి, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బిసిలకు ఎర్ర్నాయుడి మృతి తీరని లోటు అని సీతారాం ఏచూరి అన్నారు.

ఎర్రన్నాయుడి మృతి బిసిలకు తీరని లోటు అని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు అన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటూనే బిసిల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారన్నారు. ఎర్రన్నాయుడి మృతి పట్ల రాష్ట్ర మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

తెలుగుదేశం పార్టీ నేత ఎర్రన్నాయుడు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిపించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శుక్రవారం ఆదేశించారు. రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

English summary
AICC president Sonia Gandhi paid condolence for Telugudesam Party senior leader Yerrannaidu death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X