వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్బర్ అరెస్టుపై ఉత్కంఠ: గాంధీ ఆస్పత్రి వద్ద ఆందోళన

By Pratap
|
Google Oneindia TeluguNews

MIM workers protest at Gandhi hospital
హైదరాబాద్: ద్వేషపూరిత ప్రసంగం చేసిన మజ్లీస్ అక్బరుద్దీన్ ఓవైసీని పోలీసులు అరెస్టు చేస్తారా, ఇంటికి పంపిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. గాంధీ ఆస్పత్రిలో హైడ్రామా కొనసాగుతోంది. వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అక్బరుద్దీన్ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. వరంగల్ రేంజ్ ఐజి వెంకటేశ్వర రావు గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు.

వైద్య పరీక్షలు పూర్తయినందు వల్ల తాను ఇంటికి వెళ్లిపోతానని అక్బరుద్దీన్ చెప్పారు. దానికి పోలీసులు నిరాకరించారు. వైద్య పరీక్షల నివేదికలు వచ్చే వరకు ఉండాలని వారు సూచించారు. దీంతో పోలీసులతో అక్బరుద్దీన్ వాదనకు దిగారు. ఆయనను పోలీసులు ఆస్పత్రిలోని రెండో విశ్రాంతి గదికి తరలించారు. సీటీ స్కాన్ తప్ప మిగతా పరీక్షలన్నింటిలో అక్బరుద్దీన్ ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్లు తేలింది.

ఇదిలా వుంటే, హైదరాబాద్‌లో అక్బరుద్దీన్ ఒవైసీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్పత్రి ప్రధాన ద్వారం దగ్గర ఎంఐఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు మెయిన్ గేట్‌ను మూసివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆస్పత్రి పరిసరాల చుట్టూ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఆస్పత్రి పరిసరాల్లో మజ్లీస్ కార్యకర్తలు వాహనాలపై దాడి చేశారు. ఈ దాడిలో రెండు వాహనాలు ధ్వంసమైనట్లు సమాచారం. మజ్లీస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. అటు పాతబస్తీలో కూడా పోలీసులు భారీగా మోహరించారు. గుంపులు గుంపులుగా తిరుగొద్దంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక పోలీసు బలగాలు కూడా రంగంలోకి దిగాయి.

English summary

 Tension prevailed at Gandhi hospital, where the medical tests were conducted to MIM MLA Akbaruddin Owaisi. MIM acticists gathered at Gandhi hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X