అక్బర్ అరెస్టుపై ఉత్కంఠ: గాంధీ ఆస్పత్రి వద్ద ఆందోళన

వైద్య పరీక్షలు పూర్తయినందు వల్ల తాను ఇంటికి వెళ్లిపోతానని అక్బరుద్దీన్ చెప్పారు. దానికి పోలీసులు నిరాకరించారు. వైద్య పరీక్షల నివేదికలు వచ్చే వరకు ఉండాలని వారు సూచించారు. దీంతో పోలీసులతో అక్బరుద్దీన్ వాదనకు దిగారు. ఆయనను పోలీసులు ఆస్పత్రిలోని రెండో విశ్రాంతి గదికి తరలించారు. సీటీ స్కాన్ తప్ప మిగతా పరీక్షలన్నింటిలో అక్బరుద్దీన్ ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్లు తేలింది.
ఇదిలా వుంటే, హైదరాబాద్లో అక్బరుద్దీన్ ఒవైసీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్పత్రి ప్రధాన ద్వారం దగ్గర ఎంఐఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు మెయిన్ గేట్ను మూసివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆస్పత్రి పరిసరాల చుట్టూ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఆస్పత్రి పరిసరాల్లో మజ్లీస్ కార్యకర్తలు వాహనాలపై దాడి చేశారు. ఈ దాడిలో రెండు వాహనాలు ధ్వంసమైనట్లు సమాచారం. మజ్లీస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. అటు పాతబస్తీలో కూడా పోలీసులు భారీగా మోహరించారు. గుంపులు గుంపులుగా తిరుగొద్దంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక పోలీసు బలగాలు కూడా రంగంలోకి దిగాయి.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications