గాలి ఒఎంసి కేసు: రాజగోపాల్కు బెయిల్ మంజూరు

రూ. 50 వేల రూపాయల విలువ చేసే రెండు పూచీకత్తులు సమర్పించాలని, దర్యాప్తులో జోక్యం చేసుకోవద్దని కోర్టు రాజగోపాల్ను ఆదేశించింది. గతంలో కొద్ది రోజులు బెయిల్పై రాజగోపాల్ బయట ఉన్నారు. గతంలో కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్ను సిబిఐ హైకోర్టులో సవాల్ చేసింది. రాజగోపాల్ బెయిల్ను హైకోర్టు రద్దు చేసింది. దీంతో రాజగోపాల్ తిరిగి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆయన ఏడాదికి పైగా జైలులో ఉన్నారు.
ఒఎంసి కేసులో రాజగోపాల్ను సిబిఐ అధికారులు 2011 నవంబర్ 12వ తేదీన అరెస్టు చేశారు. ఇన్నాళ్లకు ఆయనకు ఊరట లభించింది. ఈ కేసులో అరెస్టయిన గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డి, అలీఖాన్ ఇంకా జైలులోనే ఉన్నారు. ఆరోగ్య కారణాల రీత్యా సస్పెన్షన్కు గురైన ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి మధ్యంతర బెయిల్ మంజూరైంది. దాన్ని పొడగించాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేసుకున్నారు.
గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన మైనింగ్ కేసులో మాజీ గనుల శాఖ మాజీ కార్యదర్శి శ్రీలక్ష్మి, గనుల శాఖ మాజీ ఎండి రాజగోపాల్లపై సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. అక్రమ మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిని ఎ-3గా, రాజగోపాల్ను ఎ-4గా చేర్చారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications