తెలంగాణపై రషీద్ అల్వీ మాట అదే: సున్నితమైంది
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన వివరాలు తనకు తెలియవని ఆయన అన్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో, కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో మాట్లాడిన విషయాలను వెల్లడించలేమని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, తెలంగాణ ఏర్పాటు కోసం తమ పార్టీ అధిష్టానం సంప్రదింపులు, కసరత్తు జరుపుతున్న సమయంలో పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సర్వేలు, రాజీనామాల బెదిరింపుల పేరిట అడ్డుకోవడం తగదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య అన్నారు. ఏకాభిప్రాయ సాధన ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే అంశం తుది దశలో కొంత మంది ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆయన బుధవారం హైదరాబాదులో మీడియాతో అన్నారు.
తెలంగాణ కోసం యువకులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు. తెలంగాణ రావడం తథ్యమని, భువనగిరి సభలో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని ఆయన అన్నారు.