పడిగాపులు: వృద్ధురాలి ఉసురు తీసిన పింఛను
హైదరాబాద్ జిల్లా అంబర్పేట మండల పరిధిలోని వృద్ధాప్యం, విక లాంగ, వితంతువు పింఛన్దారుల్లో స్మార్ట్కార్డులు లేని వారి కోసం ఈనెల 9, 10, 11వ తేదీల్లో గోల్నాకలోని వడ్డెర బస్తీలో కేంద్రం పెట్టారు. ఉదయం 8 గంటలకే ఈ కేంద్రానికి చేరుకున్న లక్ష్మమ్మ(60) మధ్యాహ్నం 2 గంటలకల్లా కూడా కార్డులు జారీ చేసేవారు రాలేదు.
గొంతు తడుపుకోవడానికి నీళ్లులేక, నిల్చోవడానికి నిలువ నీడలేక ఎండకు లక్ష్మమ్మ అల్లాడింది. వడదెబ్బకు గురై కేంద్రంలోనే కుప్పకూలిపోయింది. అక్కడ ఉన్న వారు ఆస్పత్రికి ఆమెను తరలించినా ఫలితం లేదు. వృద్ధురాలు ప్రాణం విడిచింది.
అంబర్పేట మండల పరిధిలో మూడు కేంద్రాలను ఫొటోలు దిగేందుకు ఏర్పాటు చేసినప్పటికీ సకాలంలో సిబ్బంది రాకపోవడంతో బాధితులు అష్టకష్టాలు పడ్డారు. ఈ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించకపోవడంపై కలెక్టర్ రిజ్వీ ఐసిఐసిఐ బ్యాంకు ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ జిల్లాలో అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రతినెలా మొదటి వారంలో పింఛను డబ్బులను పంపిణీ చేస్తారు. ఈనెల 5వ తేదీ నుం చి 8వ తేదీ దాకా స్మార్ట్కార్డులు ఉన్నవారికి పింఛన్ల పంపిణీ జరిగింది. వడ్డెరబస్తీ కేంద్రంలో తహసీల్దార్ల పర్యవేక్షణలో ఈ కేంద్రాల్లో వివరాల సేకరణ జరగాల్సి ఉండగా మధ్యా హ్నం దాకా అధికారులెవరూ ఈ కేంద్రాలకు వెళ్లలేదు.
రద్దీతోపాటు మండుతున్న ఎండలతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు. కొంత మంది సొమ్మసిల్లి పడిపోయారు కూడా.