పడిగాపులు: వృద్ధురాలి ఉసురు తీసిన పింఛను

హైదరాబాద్ జిల్లా అంబర్పేట మండల పరిధిలోని వృద్ధాప్యం, విక లాంగ, వితంతువు పింఛన్దారుల్లో స్మార్ట్కార్డులు లేని వారి కోసం ఈనెల 9, 10, 11వ తేదీల్లో గోల్నాకలోని వడ్డెర బస్తీలో కేంద్రం పెట్టారు. ఉదయం 8 గంటలకే ఈ కేంద్రానికి చేరుకున్న లక్ష్మమ్మ(60) మధ్యాహ్నం 2 గంటలకల్లా కూడా కార్డులు జారీ చేసేవారు రాలేదు.
గొంతు తడుపుకోవడానికి నీళ్లులేక, నిల్చోవడానికి నిలువ నీడలేక ఎండకు లక్ష్మమ్మ అల్లాడింది. వడదెబ్బకు గురై కేంద్రంలోనే కుప్పకూలిపోయింది. అక్కడ ఉన్న వారు ఆస్పత్రికి ఆమెను తరలించినా ఫలితం లేదు. వృద్ధురాలు ప్రాణం విడిచింది.
అంబర్పేట మండల పరిధిలో మూడు కేంద్రాలను ఫొటోలు దిగేందుకు ఏర్పాటు చేసినప్పటికీ సకాలంలో సిబ్బంది రాకపోవడంతో బాధితులు అష్టకష్టాలు పడ్డారు. ఈ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించకపోవడంపై కలెక్టర్ రిజ్వీ ఐసిఐసిఐ బ్యాంకు ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ జిల్లాలో అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రతినెలా మొదటి వారంలో పింఛను డబ్బులను పంపిణీ చేస్తారు. ఈనెల 5వ తేదీ నుం చి 8వ తేదీ దాకా స్మార్ట్కార్డులు ఉన్నవారికి పింఛన్ల పంపిణీ జరిగింది. వడ్డెరబస్తీ కేంద్రంలో తహసీల్దార్ల పర్యవేక్షణలో ఈ కేంద్రాల్లో వివరాల సేకరణ జరగాల్సి ఉండగా మధ్యా హ్నం దాకా అధికారులెవరూ ఈ కేంద్రాలకు వెళ్లలేదు.
రద్దీతోపాటు మండుతున్న ఎండలతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు. కొంత మంది సొమ్మసిల్లి పడిపోయారు కూడా.
-
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!!












Click it and Unblock the Notifications