సముద్ర స్నానం కోసం వెళ్లి...ఐదుగురు గల్లంతు...విశాఖలో విషాదం!
విశాఖపట్టణం: విశాఖ సాగర్ నగర్ లో సముద్ర స్నానానికి వెళ్లినవారిలో ఐదుగురు వ్యక్తులు గల్లంతు కాగా ఒక వ్యక్తి మృతిచెందాడు. మృతిచెందిన వ్యక్తి కుమారుడు తొలుత సముద్రంలో కొట్టుకుపోతుండగా అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రి చనిపోగా అతడి కుమారుడు మాత్రం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. కాగా గల్లంతైన వ్యక్తులు ఎవరనేది సమాచారం తెలుసుకోవడం పోలీసులకు కష్టతరంగా మారింది.
విశాఖలో కొందరు వ్యక్తులు మహాశివరాత్రిని పురష్కరించుకుని నిన్న ఉపవాసం, రాత్రి జాగారం చేసిన అనంతరం ఉదయాన్నే సముద్ర స్నానానికని వెళ్లారు. వీరిలో దువ్వి శివప్రసాద్, అతని కుమారుడు యశ్వంత్ కూడా ఉన్నారు. అయితే బీచ్ లో బలమైన అలల తాకిడికి తొలుత బాలుడు యశ్వంత్ నీటిలో మునుగుతుండగా అతడి తండ్రి శివప్రసాద్ కాపాడే ప్రయత్నంలో తాను కూడా నీళ్ళల్లో మునిగిపోయాడు. బాలుడి కేకలు విన్న స్థానికులు యశ్వంత్ను, అతడి తండ్రిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే యశ్వంత్ తండ్రి శివప్రసాద్ చనిపోగా, బాలుడిని రక్షించిన వారు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు

అయితే వీరితోపాటు వెళ్లిన మరో ఐదుగురు వ్యక్తుల జాడ తెలియకపోవడంతో వారు కూడా సముద్రంలో గల్లంతైనట్లు భావిస్తున్నారు. అయితే ఎవరు గల్లంతయ్యారో తెలుసుకునేందుకు వివరాలు తెలిసిన శివప్రసాద్ మృత్యువాతన పడగా, అతడి కుమారుడు యశ్వంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో వివరాలు తెలియరాలేదు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications