సముద్ర స్నానం కోసం వెళ్లి...ఐదుగురు గల్లంతు...విశాఖలో విషాదం!
విశాఖపట్టణం: విశాఖ సాగర్ నగర్ లో సముద్ర స్నానానికి వెళ్లినవారిలో ఐదుగురు వ్యక్తులు గల్లంతు కాగా ఒక వ్యక్తి మృతిచెందాడు. మృతిచెందిన వ్యక్తి కుమారుడు తొలుత సముద్రంలో కొట్టుకుపోతుండగా అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రి చనిపోగా అతడి కుమారుడు మాత్రం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. కాగా గల్లంతైన వ్యక్తులు ఎవరనేది సమాచారం తెలుసుకోవడం పోలీసులకు కష్టతరంగా మారింది.
విశాఖలో కొందరు వ్యక్తులు మహాశివరాత్రిని పురష్కరించుకుని నిన్న ఉపవాసం, రాత్రి జాగారం చేసిన అనంతరం ఉదయాన్నే సముద్ర స్నానానికని వెళ్లారు. వీరిలో దువ్వి శివప్రసాద్, అతని కుమారుడు యశ్వంత్ కూడా ఉన్నారు. అయితే బీచ్ లో బలమైన అలల తాకిడికి తొలుత బాలుడు యశ్వంత్ నీటిలో మునుగుతుండగా అతడి తండ్రి శివప్రసాద్ కాపాడే ప్రయత్నంలో తాను కూడా నీళ్ళల్లో మునిగిపోయాడు. బాలుడి కేకలు విన్న స్థానికులు యశ్వంత్ను, అతడి తండ్రిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే యశ్వంత్ తండ్రి శివప్రసాద్ చనిపోగా, బాలుడిని రక్షించిన వారు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు

అయితే వీరితోపాటు వెళ్లిన మరో ఐదుగురు వ్యక్తుల జాడ తెలియకపోవడంతో వారు కూడా సముద్రంలో గల్లంతైనట్లు భావిస్తున్నారు. అయితే ఎవరు గల్లంతయ్యారో తెలుసుకునేందుకు వివరాలు తెలిసిన శివప్రసాద్ మృత్యువాతన పడగా, అతడి కుమారుడు యశ్వంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో వివరాలు తెలియరాలేదు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications