కేజ్రీవాల్ స్ఫూర్తితో ఏపీలో కొత్త పార్టీ, గ్రేటర్లో ఏఏపీ పోటీ చేస్తుందా?
హైదరాబాద్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పార్టీ పుట్టుకు రానుంది. ఏపీలో దళిత మహాసభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు ఆధ్వర్యంలో నవ్యాంధ్ర పార్టీ పేరిత కొత్త పార్టీ ఆవిర్భవించనుంది.
ఆ పార్టీ ఆవిర్భావానికి 26వ తేదీని ముహూర్తంగా నిర్ణయించినట్లు కత్తి పద్మారావు చెప్పారు. ఆయన గుంటూరు జిల్లాలోని పొన్నూరులో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కొత్త పార్టీ పైన ప్రకటన చేశారు.
గ్రేటర్ ఎన్నికల్లో ఏఏపీ పోటీ చేస్తుందా?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం అరవింద్ కేజ్రీవాల్ దృష్టి పంజాబ్, బీహార్ రాష్ట్రాల పైన ఉంది. అదే సమయంలో పలు రాష్ట్రాలలో ఆమ్ ఆద్మీ పార్టీకి కార్యకర్తలు ఉన్నారు. హైదరాబాదులోను ఉన్నారు.
ఈ నేపథ్యంలో రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందా అనే చర్చ సాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆమ్ ఆద్మీ పార్టీ మెంబర్ షిప్ రెండు లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వేళ్లూనుకునేందుకు ప్రజా సమస్యల పైన మరింత దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో ఏఏపీ పోటీ చేస్తుందా అనే చర్చ సాగుతోంది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications