'ఆయేషామీరా హత్యపై పునర్విచారణ', 'ఆ నివేదిక ఇవ్వండి'
బి.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరాపై అత్యాచారం, హత్య కేసును పునర్విచారణ చేయాలని ఆమె తల్లి శంషాద్ బేగం డిమాండ్ చేశారు. ఈ కేసులో అసలు దోషులను వదిలేసి నిర్ధోషి సత్యంబాబును ఇరికించారని ఆమె ఆరోపించారు.
హైదరాబాద్: బి.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరాపై అత్యాచారం, హత్య కేసును పునర్విచారణ చేయాలని ఆమె తల్లి శంషాద్ బేగం డిమాండ్ చేశారు. ఈ కేసులో అసలు దోషులను వదిలేసి నిర్ధోషి సత్యంబాబును ఇరికించారని ఆమె ఆరోపించారు.
విజయవాడకు సమీపంలోని హస్టల్లో ఉన్న విద్యార్థిని ఆయేషా మీరాపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు నిందితులు.అయితే ఈ హత్య కేసులో సత్యంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా సత్యంబాబు నిర్ధోషిగా కోర్టు విడుదల చేసింది.
అయితే ఈ కేసును తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నించిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కేసును తాజాగా దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే ఈ కేసులో అసలు వాస్తవాలను తెలుసుకొనేందుకు మంచి ఏజెన్సీని ఎన్నుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కేసులో మాజీ మంత్రి కోనేరు రంగారావు మనమడు సతీష్కు సంబంధం ఉందని ఆయేషా తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే ఈ కేసు దర్యాప్తులో చోటుచేసుకొన్న తప్పిదాలపై అపెక్స్ కమిటీ నివేదికను ఆగష్టు 8వ, తేదిలోపుగా తమ ముందుంచాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.