'వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరింది వాస్తవం కాదా': బయటపెట్టిన వైసిపి
కర్నూలు: గత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరింది వాస్తవం కాదా అని వైసిపి ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆదివారం నాడు ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లలో సాంకేతిక లోపాలున్నాయని చెప్పి స్పీకర్ కోడెల శివప్రసాద రావు తిరస్కరించడం సరికాదన్నారు.
అన్ని సరిగ్గా ఉన్న పిటిషన్లను అప్పుడే సభాపతికి అందించామని చెప్పారు. ఫిరాయింపుల అనర్హత పిటిషన్లను ఇప్పటి దాకా ఎందుకు పెండింగులో పెట్టారో చెప్పాలన్నారు. తాము ఏప్రిల్లోనే సరైన పిటిషన్లు ఇస్తే, ఇప్పటి దాకా పెండింగులో పెట్టారన్నారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలు విషయంలో చట్టం ఏం చెప్తుందో తెలియదా అని ప్రశ్నించారు. ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందన్నారు. అందుకే తాము పార్టీ ఫిరాయింపుల పైన సుప్రీం కోర్టును ఆశ్రయించామన్నారు. ఈ నెల 8న సుప్రీంలో దీనిపై విచారణ జరగనుందని చెప్పారు.
అసలు కారణం వేరే..! అందుకే అనర్హత పిటిషన్ల తిరస్కరణ : బుగ్గనఈ లోగా సుప్రీంకు ఏదో ఒక కారణం చెప్పాలనే ఉద్దేశ్యంతోనే పిటిషన్లను తిరస్కరించారని ఆరోపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం ఎన్నో చారిత్రక తీర్పులు ఇచ్చిందని, అవసరమైతే అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని సమీక్షించే అధికారం ఉందని చెప్పినట్లు బుగ్గన చెప్పారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications