నోట్ల రద్దు: బ్యాంక్ వద్ద ఫ్రీగా కూల్ డ్రింక్స్, తిరుపతిలో సంచార ఏటీఎం
నెల్లూరు: రూ.500, రూ.1000 నగదు మార్పిడి కోసం బ్యాంకుల వెంట గంటల కొద్ది పడిగాపులు కాసే శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొందరికి చల్లటి వార్త. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నోట్ల మార్పిడి, డబ్బుల కోసం ఏటీఎంల వద్ద, బ్యాంకుల వద్ద పెద్ద ఎత్తున క్యూ కనిపిస్తోన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కోకాకోలా కంపెనీ యాజమాన్యం అన్ని బ్యాంకుల వద్ద మూడు రోజుల పాటు ఉచితంగా కూల్ డ్రింకులు సరఫరా చేయనుంది. డబ్బు కోసం రోజంతా క్యూ లైన్లలో నిలబడి విసిగిపోతున్న వారికి చల్లని కూల్ డ్రింక్ అందించాలని నిర్ణయించారు.

వేదాయపాలెం సెంటర్లోని ఎస్బీఐ వద్ద కోకాకోలా ప్రతినిధులు కూల్ డ్రింక్ పంపిణీ చేసారు. ఎండలో అలసిపోయిన తమకు కూల్ డ్రింక్ ఇచ్చి ఉపశమనం కలిగేలా చేశారని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల ఇలా చేపట్టినట్లు చెబుతున్నారు. ఎల్లుండి వరకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు.
తిరుపతిలో సంచార ఏటీఎం
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఖాతాదారుల ఇబ్బందుల దృష్ట్యా ఏపీలో తొలి సంచార ఏటీఎంను చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రారంభించారు. ఎస్బీఐ డీజీఎం కులకర్ణి దీనిని ప్రారంభించారు. మొబైల్ వాహనంలో నగదు డిపాజిట్ చేసే యంత్రం, ఏటీఎం ఉండటంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications