భవిష్యత్తుపై సమావేశం: కన్నీరు పెట్టిన డిఎల్

తన భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన కన్నీరు పెట్టారు. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో తన వెంట ఉన్న ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఎప్పుడూ ప్రజా శ్రేయస్సు కోసమే తపించానని అన్నారు.
తన భవిష్యత్ రాజకీయ జీవితంపై ప్రజా బ్యాలెట్ నిర్వహించానని, ప్రజలు ఇచ్చే తీర్పుతోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనేది తేలుతుందని రవీంద్రారెడ్డి చెప్పారు. రాష్ట్రమంతా ఎన్టీఆర్ గాలి వీస్తున్న సమయంలో తాను, వైఎస్ రాజశేఖర్రెడ్డి ఎన్నికల్లో గెలిచామని ఆయన చెప్పారు.
కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన డిఎల్ రవీంద్రారెడ్డి ఆయనతో విభేదాలు వచ్చి రాజీనామా చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన దాదాపుగా కాంగ్రెసు కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటూ వచ్చారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను వ్యతిరేకించిన కాంగ్రెసు నాయకుల్లో ఆయన ముఖ్యుడు. జగన్పై కడప లోకసభ స్థానంలో పోటీ కూడా చూశారు.












Click it and Unblock the Notifications