కుప్పంపై దృష్టి పెట్టనున్న జగన్ .. అమేధీ తరహా వ్యూహ రచనలో వైసీపీ బాస్ ఏపీ సీఎం జగన్
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గం పై దృష్టి సారిం చారా ? కుప్పం నియోజకవర్గంలో బిజెపి అమేథీలో అనుసరించిన వ్యూహాన్ని జగన్మోహన్ రెడ్డి అనుసరించబోతున్నారా ? 2024 టార్గెట్ గా వైయస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు చెక్ పెట్టాలనుకుంటున్నారా? అంటే తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి.

కుప్పం నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టనున్న జగన్
కుప్పం నియోజకవర్గం నుండి చంద్రబాబు నాయుడు ఈసారి అతికష్టం మీద 30 వేల మెజారిటీతో మాత్రమే గెలిచారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుండి చంద్రబాబు నాయుడుని ఓడించాలని కుప్పం నియోజకవర్గ అభివృద్ధి పై దృష్టి సారించారు ఏపీ సీఎం జగన్. అందులో భాగంగా అధికారులకు కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన పూర్తి నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. కుప్పంలో వైసిపిని ఓడించినప్పటికీ వైసీపీ అధినేత జగన్ మాత్రం ఈ ఐదేళ్లు కుప్పం నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు.

అమేథీ తరహా వ్యూహ రచనలో జగన్ .. అమేధీ బీజేపీ ప్లాన్ కుప్పంలో అమలు
తాజా ఎన్నికల్లో అమేధీలో బిజెపి వ్యూహం ఎలా అయితే అమలుచేసి స్మృతి ఇరానీని గెలిపించారో .. రాహుల్ గాంధీని ఓటమి పాలు చేశారో ఆ ప్లాన్ తోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం పై దృష్టి సారించారని చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో అమేధీలో బిజెపి ఓటమి పాలైంది. అయినప్పటికీ బిజెపి అమేధీ అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి సారించి అయిదేళ్ల పాటు పని చేసింది. ఫలితంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమేధీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగిన ఏఐసిసి చీఫ్ రాహుల్ గాంధీని ఓడించి స్మృతి ఇరానీకి పట్టం కట్టారు. ఇప్పుడు జగన్ సైతం అమేథీలో బిజెపి అనుసరించిన వ్యూహాన్నే కుప్పం నియోజకవర్గంలో అనుసరించాలని భావిస్తున్నారు.

చంద్రబాబును ఇబ్బంది పెట్టె ఆలోచనలో జగన్ .. 2024 ఎన్నికలకు ఇప్పటి నుండే వ్యూహం
ఒకవేళ నిజంగానే జగన్ కుప్పం నియోజకవర్గం పై దృష్టి పెట్టి అభివృద్ధి పథంలో నడిపిస్తే 2024 ఎన్నికల్లో అది టిడిపి బాస్ చంద్రబాబుకు ఇబ్బందికర పరిణామాలను తెచ్చిపెడుతుంది. పదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకున్న జగన్ ఈ ఐదేళ్ళ పాటు మాత్రమే కాకుండా 2024 లో కూడా అధికారాన్ని చేజిక్కించుకోవడం లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే కుప్పం నియోజకవర్గం పై ఆయన దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications