సొంతింటికి కిరణ్, ప్రజలకు సారీ: ఆటోలో శైలజానాథ్
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం సొంతింటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నించానని, విభజనను అడ్డుకోలేక పోయినందుకు తాను క్షమాపణలు చెబుతున్నానని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తెలుగు ప్రజల ఏకాభిప్రాయంతో జరగలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు)లో లోపాలు ఉన్నాయని, విభజనలో ప్రతి దశలు జరిగాయని ఆయన అన్నారు. కాగా, కిరణ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఆటోలో వెళ్లిన శైలజానాథ్
కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో మాజీ మంత్రి శైలజానాథ్ తన అధికారిక వాహనం అయిన కారును సిఎం క్యాంపు కార్యాలయం వద్ద వదిలి ఆటోలో వెళ్లిపోయారు.
విభజన రాజ్యాంగ విరుద్ధం: కోట్ల
లోకసభలో రాష్ట్ర విభజన తీరు రాజ్యాంగ విరుద్దమని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ విభజనలో కాంగ్రెస్ కంటే బిజెపి పాత్రే ఎక్కువ అన్నారు. తెలంగాణ బిల్లుపై ఓటింగ్ జరగకుండా మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదానికి బిజెపి ఎలా ఒప్పుకుందని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ఆలోచిస్తున్నామని కోట్ల తెలిపారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications