తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు, విరిగిన చేయి
శుక్రవారం ఉదయం విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి భూమయ్యయాదవ్, సర్పంచ్ లు జమునాబాయి అర్జున్సింగ్, పీఏసీఎస్ డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి సంఘటనను ఖండించారు. నిందితులను కఠిణంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల మండలం సర్థాపూర్ గ్రామ శివారులో ఓ ప్రైవేటు స్కూలు బస్సు ప్రమాదానికి గురైంది. స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనడానికి విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సును వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడగా, మరో నలుగురికి గాయాలయ్యాయి.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 20 మంది చిన్నారులు ఉన్నారు. గాయపడిన పిల్లల పట్ల పాఠశాల యాజమాన్యం సరిగా స్పందించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.