తప్పిన పెను ప్రమాదం: 14కి.మీలు వెనక్కి వెళ్లిన రైలింజన్, ఏం జరిగిందంటే..?
అనంతపురం: గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో బుధవారం ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వాడి రైల్వేస్టేషన్లో నిలిపి ఉన్న ఓ విద్యుత్ రైలింజన్ దానంతట అదే రైలు పట్టాలపై 14 కిలోమీటర్లు వెనుకకు వెళ్లింది.

చెన్నై నుంచి ముంబైకి బయల్దేరిన మెయిల్ ఎక్స్ప్రెస్ రైలుకు గుంతకల్లులో విద్యుత్ లోకోను అనుసంధానం చేసి పంపారు. వాడి నుంచి ముంబై వెళ్లేందుకు విద్యుదీకరణ చాలినంత లేకపోవడంతో రైలుకు చెందిన విద్యుత్ లోకోను తొలగించి డీజిల్ లోకోను అనుసంధానించారు.
అయితే, ఈ సమయంలో సాంకేతిక లోపం కారణంగా వాడి స్టేషన్లో నిలిపి ఉన్న విద్యుత్లోకో నాల్వార్ రైల్వేస్టేషన్ వరకు పరుగుతీసింది. ఆ సమయంలో అదే లైనులో మరే రైళ్లు రాకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. కాగా, ఈ ఘటనపై విచారణ జరిపి నివేదికను అందజేయాలని డీఆర్ఎమ్ విజయప్రతాప్ సింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications