రాజ్యసభ: ఒక్కొక్కరికి 47, కెకెకు కాంగ్రెసు ఓట్లు లేనట్లే!

కాంగ్రెసు పార్టీకి చెందిన ఓట్లను పార్టీ అభ్యర్థులు కెవిపి రామచంద్ర రావు, టి సుబ్బి రామి రెడ్డి, ఎంఏ ఖాన్లకు ఒక్కొక్కరికి 47 చొప్పున కేటాయించారు. ఇప్పటి వరకు కాంగ్రెసులో మిగిలిన ఓట్లు కెకెకు వేస్తారని భావించినప్పటికీ కాంగ్రెసు దానికి చెక్ చెప్పింది. దీంతో కాంగ్రెసు ఓట్లు కెకెకు పడే అవకాశం లేదు. దీనిపై తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలో గోల్కోండ హోటల్లో చర్చిస్తున్నారు. 37 ఓట్లు వేస్తే అభ్యర్థి గెలుస్తారు. మిగులు ఓట్లపై నిర్ణయం తీసుకోనున్నారు.
కనీసం రెండో ప్రాధాన్యత ఓటును కెకెకు వేసే విషయమై సమాలోచనలు చేస్తున్నారు. అధిష్టానం అనుమతి కోసం వారు చూస్తున్నారు. ఆదాల తప్పుకోవడంతో రాజ్యసభ ఎన్నికలు కేవలం నామమాత్రమే అవుతున్నాయి. మరోవైపు తెలుగుదేశం తమ పార్టీ అభ్యర్థులు గరికపాటి మోహన రావు, సీతారామలక్ష్మిలకు 37 ఓట్ల చొప్పున కేటాయించింది.
తొలుత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిక ఓటేస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే హన్మంతు షిండే గురువారం యూ టర్న్ తీసుకున్నారు. తాను తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కె కేశవ రావుకు ఓటు వేస్తానని తెలిపారు. తాను తెరాస అభ్యర్థికి ఓటేశానని గంగుల కమలాకర్ చెప్పారు.
కాగా, రాజ్యసభ ఎన్నికల్లో సభాపతి నాదెండ్ల మనోహర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పన్నెండుమంది తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యులు కూడా వినియోగించుకున్నారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications