చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భూప్రకంపనలు, భయంతో పరుగు తీసిన జనం
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం నాడు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగెత్తారు.
చిత్తూరు/నెల్లూరు: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం నాడు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగెత్తారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కృష్ణాపురం గ్రామం, నెల్లూరు జిల్లాలోని పొదలకూరు గ్రామాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

భూమి నాలుగు సెకన్ల పాటు కంపించడంతో ప్రజలు బెంబేలెత్తారు. ప్రజలంతా వీధుల్లోకి వచ్చారు. కాగా, ఆ తర్వాత కాసేపటికి అంతా సర్దుకుంది.












Click it and Unblock the Notifications