ఉద్దేశం అది కాదు: శేషాచలం ఎన్కౌంటర్పై హోం మంత్రి, తమిళ నేతలదే తప్పని బొజ్జల
కాకినాడ చిత్తూరు: చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లను ఎన్కౌంటర్ చేయడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి చిన్న రాజప్ప అన్నారు. శనివారంనాడు ఆయన తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడారు.
గత ఆరు నెలలుగా ఎర్రచందనం స్మగ్లర్లకు హెచ్చరికలు చేస్తూనే ఉన్నామని, విధిలేని పరిస్థితిలోనే ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు. గతంలో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ను పట్టుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఎదురుకుందని ఆయన గుర్తు చేశారు.

20 మంది ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ నేపథ్యంలో అటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడిన సంక్షోభాన్ని నివారించే చర్యలు చేపడుతామని ఆయన చెప్పారు. చర్చల ద్వారా ఇరు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలను పునరుద్ధరిస్తామని ఆయన చెప్పారు.
తమిళులపై తమకు ఎంతో గౌరవం ఉందని రాష్ట్ర అటవీ శాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. అందుకే తాము తెలుగుగంగ నీటిని తమిళనాడుకు ఇస్తున్నామని ఆయన శనివారంనాడు చిత్తూరులో అన్నారు.
అడవులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. తమిళ రాజకీయ నేతలో సంఘటనపై వివాదం సృష్టిస్తున్నారని ఆయన అన్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications