టిలో బలంగా ఉన్నాం, వారిలా గాలికి వదిలేయం!: కోడెల

తాము తెలంగాణను వదిలేయకుండా సమైక్యం వైపు మొగ్గేలా ప్రయత్నాలు చేస్తామన్నారు. తెలంగాణను వదులుకోమన్నారు. తమ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు తమ పైన విమర్శలు చేయడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. అవి కడుపు మండిన మాటలు అన్నారు. 80 శాతం మంది సమైక్యం కోరుకుంటున్నారని, విడిపోతే భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు కూడా బాధపడతారన్నారు. విభజనపై టిడిపి ఇరకాటంలో ఉన్న మాట వాస్తవమేనన్నారు. సమన్యాయం లేదా సమైక్యం తమ డిమాండ్ అన్నారు.
కేంద్రమంత్రులు అమ్ముడుపోయారు: సోమిరెడ్డి
కేంద్రమంత్రులు, ఎంపీలు ప్యాకేజీలకు అమ్ముడు పోయారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేరుగా విమర్శించారు. రాష్ట్ర సమైక్యత కోసం సీమాంధ్ర ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమిస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. వంద రోజుల సమైక్య ఉద్యమం సందర్భంగా ఎన్టీఆర్ సర్కిల్లో వందమందితో సోమిరెడ్డి రిలే దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు సీమాంధ్రలో పోరాటం ఆగదని సోమిరెడ్డి హెచ్చరించారు.
సోనియా ఆదేశాల మేరకే: వర్ల
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకే వైయస్ జగన్ సమైక్య ముసుగులో విభజనకు సహకరిస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. ప్రజలను మభ్య పెట్టేందుకే రోడ్ల దిగ్బంధమన్నారు. సమైక్యంపై చిత్తశుద్ధి ఉంటే సోనియా ఇంట ముందు ధర్నా చేయాలన్నారు.












Click it and Unblock the Notifications