అక్రమ మైనింగ్ లో చంద్రబాబు,యరపతినేని హస్తం...లీకేజీలపై సమాధానమేంటి?:బొత్సా
హైదరాబాద్:రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న అక్రమ మైనింగ్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయడు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హస్తం ఉందని వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు.
సోమవారం హైదరాబాద్ లోటస్పాండ్లోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ది ఉంటే గుంటూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై సీబీఐ విచారణ జరిపించాలని బొత్సా సవాలు విసిరారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు సచివాలయంలో లీకేజీలపై ప్రభుత్వ సమాధానమేంటని బొత్సా నిలదీశారు.

కొండను తవ్వి...ఎలుకను పట్టినట్లు
అక్రమ మైనింగ్ లో అసలు దోషులను కాపాడుతూ కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు అధికారులకు ప్రభుత్వం నోటీసులివ్వడం సిగ్గుచేటని బొత్సా సత్యనారాయణ విమర్శించారు. ఈ ఒక్క విషయంతోనే ప్రజాధనాన్ని టీడీపీ ప్రభుత్వం ఎంతలా దోచుకుంటుందో ప్రజలకు స్పష్టంగా అర్థమయిందని బొత్సా వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో గనుల దోపిడీ విషయమై కేసును సీఐడీకి అప్పగించడాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ట్విట్టర్ లో విడుదల చేసిన ఒక ప్రకటనలో తప్పుబట్టారు.

వాస్తవాలను...కప్పిపుచ్చేందుకే!
వాస్తవాలను కప్పి పుచ్చడం కోసమే ఆ కేసును సీఐడీకి అప్పగించారని జగన్ తన ప్రకటనలో ఆరోపించారు. అసలైన దోషులను రక్షించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. తన చేతిలోని దర్యాప్తు సంస్థ ద్వారా పెద్ద తప్పును చిన్నదిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విపక్ష నేత తెలిపారు. పల్నాడు గనుల దోపిడీపై సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ ఆయన సీఎం చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరిన నేపథ్యంలో జగన్ సవాలును బొత్సా పునరుద్ఘాటించారు.

సహాయక చర్యలు...పెంచండి
మరోవైపు రాష్ట్రంలో గతకొద్ది రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమవుతోందని బొత్స చెప్పారు. వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని...వరద ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు పెంచాలని ఆయన సూచించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని బొత్సా కోరారు.

లీకేజీలపై...సమాధానం ఏంటి?
ఉత్తరాంధ్రలో విషజర్వాలు ప్రబలుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని బొత్సా ఆరోపించారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు సచివాలయంలో లీకేజీలపై ప్రభుత్వ సమాధానమేంటని బొత్సా నిలదీశారు. గతంలో లీకేజీల గురించి ప్రస్తావిస్తే ప్రతిపక్షమే విమర్శిస్తుందే తప్పా అసలు ఏంలేదని చెప్పిన ప్రభుత్వం...ఇప్పుడు సచివాలయం లీకేజీలపై సమాధానం చెప్పాలని బొత్సా డిమాండ్ చేశారు.
-
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో మల్టీప్లెక్స్ రూల్స్ -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..?












Click it and Unblock the Notifications