కచ్చులూరులో 144 సెక్షన్ ... బోటు వెలికితీత పనులు నిలిపివేత ..జలసమాధిలోనే 16మంది
గోదావరిలో బోటు వెలికితీత కోసం అధికారులు తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో బోటు వెలికితీత చర్యలను అధికారులు నిలిపివేశారు. దీంతో బోటును వెలికి తీసేందుకు ప్రయత్నం చేసిన నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఇతర బృందాలు తిరిగి వెళ్లిపోయాయి.

జలసమాధిలోనే 16 మృతదేహాలు
తూర్పుగోదావరి జిల్లాలోని కచ్చలూరు వద్ద గోదావరి నదిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు 35 మంది మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా 16 మంది మృతదేహాలను వెలికి తీయాల్సిన ఉంది. వారిలో ఎవరు బ్రతికి ఉండే పరిస్థితి లేదు అని అధికారులు నిర్ధారించారు. ఎందుకంటే గత ఆదివారం బోటు ప్రమాదం జరిగినప్పటినుంచి నేటి వరకు వారి ఆచూకీ లభించలేదు. ఇక నీటిలో 315 అడుగుల లోతులో మునిగిన బోటును వెలికి తీసేందుకు ఉత్తరాఖండ్ నుండి వచ్చిన నిపుణుల బృందం ప్రయత్నం చేసింది.

ఫలించని బోటు వెలికితీత ప్రయత్నాలు
బోటు జాడను గుర్తించిన నిపుణుల బృందం బోటు నదిలో ఎలా కూరుకుపోయి ఉందో పరిస్థితిని చూడడం కోసం పంపించిన కెమెరాలు బురదలో చిక్కుకు పోవడంతో బోటు ను కనిపెట్టిన కష్టంగా మారిందని పేర్కొన్నారు. అయినప్పటికీ వాటిని వెలికి తీయడానికి వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఆ చర్యలు నిలిపివేశారు.
కాకినాడ, ముంబైల నుంచి వచ్చిన నిపుణులతో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం .

వెనక్కి వెళ్ళిపోయిన నేవీ, ఎన్డీఆర్ఎఫ్ దళాలు, ఇతర బృందాలు
ఉత్తరాఖండ్ నిపుణుల బృందం శతవిధాల ప్రయత్నించినప్పటికీ, ఇక స్థానికంగా బోట్లను తీయడంలో నిపుణులైన వారి సహాయ సహకారాలు తీసుకున్నప్పటికీ బోటు ను బయటకు తీయడం సాధ్యం కాలేదు . గోదావరి లో ఇప్పుడు ఉన్న వరద ఉధృతితో బోటు వెలికితీత సాధ్యం కాదని నిపుణుల బృందం తేల్చేసింది. ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో బోటు వెలికితీత పనులను అధికారులు నిలిపివేశారు. సహాయక చర్యల్లో పాల్గొన్న నేవీ, ఎన్డీఆర్ఎఫ్ దళాలు, ఇతర బృందాలు కూడా ఘటనా స్థలం నుంచి వెనక్కి వెళ్లిపోయాయి.

కచ్చులూరులో 144 సెక్షన్
ఇంకా ఈ ఘటనలో తమ వారి జాడ తెలియక బాధపడుతున్న కుటుంబాలు తీవ్ర ఆవేదనలో ఉన్నాయి. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇప్పటి వరకు 35 మంది మృతదేహాలను అధికారులు వెలికితీసి సంబంధిత కుటుంబాలకు అందజేశారు. ఇంకా 16 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. కాగా, ప్రమాదం జరిగిన కచ్చలూరు పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఇంకా ఆచూకీ తెలియని వారి బంధువులు ఆందోళనలో ఉన్న నేపథ్యంలోనే అక్కడ ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా 144 సెక్షన్ విధించి నట్లుగా తెలుస్తుంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications