రాజధాని రైతులకు బేడీలపై ఎస్పీ సీరియస్- ఆరుగురు కానిస్టేబుళ్లపై వేటు, విచారణ కమిటీ
అమరావతి రాజధాని రైతులను జైలుకు తరలించే క్రమంలో వారికి బేడీలు వేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అన్నదాతలకు క్రిమినల్స్ తరహాలో బేడీలు వేయడమేంటని విపక్షాలు మండిపడ్డాయి. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
కృష్ణాయపాలెంకు చెందిన రైతులకు బేడీలు వేసి జైలుకు తరలించడంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో గుంటూరు ఎస్పీ విశాల్ గున్నీ సీరియస్ అయ్యారు. రైతులకు బేడీలు వేసిన ఘటనకు బాధ్యులైన ఆరుగురు ఎస్కార్ట్ హెడ్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. మరికొందరికి ఛార్జి మెమో ఇచ్చారు. అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో కమిటీని కూడా ఏర్పాటు చేసి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఛార్జ్మోమో జారీ చేసిన వారిలో ఆర్ఎస్సై, ఆర్ఐ కూడా ఉన్నారు.

ఇప్పటికే అమరావతి ప్రాంత రైతులపై పోలీసుల వ్యవహారశైలి నిత్యం విమర్శలకు తావిస్తోంది. పోలీసుల తీరుపై అమరావతి ఉద్యమకారులతో పాటు విపక్షాలు కూడా మండిపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఆందోళన చేస్తున్న రైతులను బేడీలు వేసి మరీ బస్సులో జైలుకు తరలించారు. దీంతో ఈ ఘటన అమరావతి గ్రామాల్లో ఉండే స్ధానికుల్లో మరింత ఆగ్రహం నింపింది. రాజకీయ పార్టీల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో పోలీసులు ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించారు.
-
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టులో పెద్దిరెడ్డికి ఝలక్ - చంద్రబాబుతో వ్యవహారంలో..! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !!












Click it and Unblock the Notifications