వైఎస్ షర్మిల దీక్ష భగ్నం.. పాదయాత్ర చేస్తుండగా అరెస్ట్, స్పృహ తప్పడంతో..
ఉద్యోగుల సమస్య పరిష్కరించాలని, నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వాలని వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. 72 గంటల దీక్ష చేస్తానని షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. అర్ధాంతరంగా పోలీసులు షర్మిల దీక్షను భగ్నం చేశారు. అంతకుముందు వైఎస్ షర్మిల స్పృహతప్పి పడిపోయారు.
Recommended Video

దీక్ష భగ్నం.. షర్మిల అరెస్ట్
ఇందిరా పార్క్ నుంచి లోటస్ పాండ్ వరకు తలపెట్టిన షర్మిల పాదయాత్ర భగ్నమైంది. ఇందిరా పార్క్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. అయినా కూడా ఆమె పాదయాత్ర కొనసాగించేందుకు యత్నించారు. పోలీసుల దురుసుగా ప్రవర్తించారు. ఒక దశలో స్పృహతప్పి పడిపోయారు. తేరుకున్నాక షర్మిలను అరెస్ట్ చేసి బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్కు తరలించారు.

తోపులాట జరగడంతో..
ఇందిరా పార్క్ నుంచి లోటస్ పాండ్ వరకు పాదయాత్ర చేపట్టారు. షర్మిల పాదయాత్రను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఆమెకు మద్దతు ఇచ్చేందుకు వచ్చిన అభిమానుల మధ్య తోపులాట జరిగింది. ఆ సమయంలో షర్మిల స్పృహతప్పి పడిపోయారు. షర్మిల తేరుకున్నాక పాదయాత్ర కొనసాగింది. తర్వాత షర్మిల దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

72 గంటలా.. నో
దీక్షకు 72 గంటల సమయం కావాలని షర్మిల కోరారు. కానీ ప్రభుత్వం మాత్రం ఒక్కరోజే అనుమతి ఇచ్చింది. దీక్ష విరమించాలని పోలీసులు కోరారు. అయినా దీక్ష కొనసాగించడంతో.. బలవంతంగా లాక్కెళ్లారు. ఇందిరా పార్క్ వద్ద దీక్ష భగ్నం చేసిన తర్వాత లోటస్ పాండ్ నడచి వెల్లేందుకు షర్మిల ప్రయత్నించారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీద పోలీసులు అడ్డుకున్నారు. తాను 72 గంటల దీక్ష చేస్తానని షర్మిల చెప్పారు. తనను ఎక్కడికి తీసుకెళ్లినా పాదయాత్రగా వచ్చి దీక్ష చేస్తానని షర్మిల స్పష్టం చేశారు.

1.91 లక్షల ఉద్యోగాల భర్తీ
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలనే డిమాండ్తో ధర్నాచౌక్లో వైఎస్ షర్మిల దీక్ష చేపట్టారు. ఆమెకు ప్రజా సంఘాలు, మేధావుల నుంచి మద్దతు లభించింది. రచయిత కంచె ఐలయ్య కూడా మద్దతు పలికారు.

రాజకీయ దుమారం
తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రాజకీయ దుమారం రేగింది. షర్మిల పార్టీ హాట్ టాపిక్ అయ్యింది. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం షర్మిలపై కౌంటర్ అటాక్ చేస్తోంది. తెలంగాణలో మరో పార్టీకి అవకాశం లేదని చెబుతున్నారు. కానీ ప్రజల పక్షాన పోరాడేందుకు ఒక పార్టీ అవసరం అని షర్మిల చెబుతున్నారు. ఆమె పార్టీలో ఒక్కో నేత చేరుతున్నారు.
-
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications