11 మంది మృతి: సాయం చేద్దామని వెళ్లి.. తిరిగిరానీ లోకాలకు
మధ్యప్రదేశ్ బావిలో 30 మంది పడిపోయిన సంగతి తెలిసిందే. అందులో 11 మంది మృతదేహాలను వెలికితీశారు. బాలుడిని తీసే ప్రయత్నంలో భాగంగా అంతమంది బావిలోకి దూకారు. అయితే అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. 19 మందిని కాపాడగలిగారు. కానీ 11 మంది మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషాద ఘటన విదిషా జిల్లా గంజ్ బసొడాలో గల లాల్ పాటార్ గ్రామంలో జరిగింది.
ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. మృతులకు ప్రగాఢ సంతాపం తెలిపింది. వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థికసాయం చేస్తామని తెలియజేసింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తామని సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ప్రకటించారు. గాయపడ్డవారికి రూ. 50 వేల చొప్పున అందజేస్తామని ప్రకటించారు. ఆ కుటుంబాలకు అండగా ఉంటామని చౌహాన్ తెలిపారు.
మంగళవారం రాత్రి ఓ యువకుడు బావిలో పడిపోయాడు. అతనిని కాపాడేందుకు మిగతా వారు దూకారు. మరికొందరు బావి సమీపంలో గుమికూడారు. అయితే అక్కడ గల పారపెట్ వద్ద ఎక్కడం, ఎక్కువ లోడ్ కావడంతో అదీ కూలిపోయింది. అదీ 50 ఫీట్ల లోతుకు వెళ్లి.. నీరు పైకి వచ్చింది. వెంటనే ట్రాక్టర్ తీసుకొచ్చి సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యలను మంత్రి విశ్వరూప్ సారంగ్ పర్యవేక్షించారు.