సిమితో సంబంధాలు లేవు: 17 మంది విడుదల
బెంగళూరు: వివిధ కేసులలో అరెస్టు అయిన అనుమానిత ఉగ్రవాదులను విడుదల చెయ్యాలని కర్ణాటకలోని హుబ్బళి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. హుబ్బళి ఒకటవ అడిషనల్ కోర్టు గురువారం ఈ ఆదేశాలు జారీ చేసింది.
సిమి ముసుగులో దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారని, సిమితో సంబంధాలు సాగిస్తున్నారని ఆరోపిస్తూ హుబ్బళి పోలీసులు 17 మంది అనుమానితులను 2008లో అరెస్టు చేశారు. అప్పటి నుండి వీరు జైలులో ఉన్నారు.

పోలీసులు విచారణ చేసి నివేదికను న్యాయస్థానంలో సమర్పించారు. అయితే సరైన సాక్ష్యాలు సమర్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలం అయ్యారని, వీరు సిమి కార్యకర్తలు అని నిరూపించలేక పోయారని న్యాయస్థానం గుర్తించింది.
అరెస్టు అయిన వారిలో సఫ్దార్ హుస్సేన్ నగూరితో సహా 17 మంది ఉన్నారు. నగూరి సిమి నాయకుడు అని పోలీసు అధికారులు చాల సందర్బాలలో చెప్పారు. అయితే సాక్ష్యాలు సమర్పించడంలో పోలీసులు మాత్రం విఫలం అయ్యారు. వీరి మీద ఎలాంటి నేరం రుజువు కాలేదని అందుకే విడుదల చేస్తున్నామని న్యాయస్థానం వెల్లడించింది.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications