నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసు: సీబీఐతో విచారణ చేయించాలి: హీరో దిలీప్, కేంద్రానికి లేఖ !
ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసుకేరళ పోలీసుల మీద నమ్మకం పోయింది, కేసులో ఇరికించారుసీబీఐతో విచారణ చేయించాలని కేంద్రానికి లేఖ రాసిన హీరో దిలీప్
తిరువనంతపురం: ప్రముఖ బహుబాష నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసును సీబీఐకి అప్పగించాలని ఆకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాలీవుడ్ హీరో దిలీప్ డిమాండ్ చేస్తున్నారు. నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో వాస్తవాలు వెలుగు చూడాలంటే సీబీఐతో దర్యాప్తు చేయించాలని దిలీప్ అంటున్నాడు.
నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసును సీబీఐతో విచారణ చేయించాలని హీరో దిలీప్ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. రెండు వారాల క్రితమే మాలీవుడ్ హీరో దిలీప్ 12 పేజీల లేఖను కేంద్ర హోం శాఖ కార్యదర్శికి పంపించారని శుక్రవారం వెలుగు చూసింది.

లేఖలో నివరాలు ఈ విధంగా ఉన్నాయి. నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని దిలీప్ వివరించాడు. కేరళ డీజీపీ లోక్ నాథ్ బెహరా, ఏడీజీపీ సంధ్యా, ఎర్నాకుళం గ్రామీణ జిల్లా ఎస్పీ జార్జ్ కలిసి తనను ఈ కేసులో ముద్దయిని చేసి అరెస్టు చేశారని ఆరోపించారు.
నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసు విచారణ నుంచి డీజీపీ లోక్ నాథ్ బెహరా, ఏడీజీపీ సంధ్యా, ఎర్నాకుళం గ్రామీణ జిల్లా ఎస్పీ జార్జ్ ను తప్పించాలని డిమాండ్ చేశారు. నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో ప్రముఖ ముద్దాయి పల్సర్ సునీ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఫిర్యాదు చేసినా పోలీసు అధికారులు పట్టించుకోలేదని దిలీప్ ఆరోపిస్తున్నాడు.
2017 ఫిబ్రవరి 17వ తేదీన రాత్రి షూటింగ్ ముగించుకుని ఇంటికి వెలుతున్న ప్రముఖ నటిని పల్సర్ సునీ తదితరులు కిడ్నాప్ చేసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో జులై 11వ తేదీన కేరళ పోలీసులు హీరో దిలీప్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. నాలుగు సార్లు బెయిల్ నిరాకరించిన న్యాయస్థానం చివరికి అక్టోబర్ 3వ తేదీన హీరో దిలీప్ కు బెయిల్ మంజూరు చెయ్యడంతో అతను బయటకు వచ్చి సీబీఐతో విచారణ చేయించాలని అంటున్నాడు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications