ఒకే పళ్లెం.. ఒకే మంచం: జయలలితతో అమృత అనుబంధమిలా!, అవే సాక్ష్యం..
చెన్నై: జయలలిత కడుపున పుట్టిన బిడ్డగా తెర పైకి వచ్చిన అమృత.. తన వారసత్వాన్ని నిరూపించుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సుప్రీం కోర్టులో ప్రతికూలత ఎదురైనా.. కర్ణాటక హైకోర్టు మెట్లెక్కడానికి సన్నద్దమవుతున్నారు.
Recommended Video

ఈ నేపథ్యంలో అమ్మతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అమ్మతో ఎలా గడిపింది?.. ఆమె మరణానికి ముందు చివరి సమయంలో ఏం మాట్లాడింది?.. వంటి విషయాలను తాజాగా మీడియాతో పంచుకున్నారు.

ఒక పళ్లెం.. ఒకే మంచం:
1996తర్వాత తాను చాలాసార్లు జయలలితను కలిశానని అమృత తెలిపారు. తాను వెళ్లినప్పుడల్లా అమ్మ చూపిన ఆప్యాయతను ఎప్పటికీ గుర్తుచేసుకుంటానన్నారు. అమ్మతో ఎప్పుడూ గడిపినా.. ఇద్దరం ఒకే పళ్లెంలో తిని.. ఒకే మంచంపై నిద్రపోయేవాళ్లమని గుర్తుచేసుకున్నారు.

క్షేమంగా ఉండు:
అమ్మను కలిసేందుకు సెక్రటేరియట్ కు వెళ్లిన ప్రతీసారి క్షేమంగా ఉండాలంటూ తనను ఆశీర్వదించేవారని భావోద్వేగంగా చెప్పారు. ఎక్కడున్నా సరే.. క్షేమంగా ప్రాణాలతో ఉండు అని అంటుండేవారని చెప్పుకొచ్చారు.

రావద్దన్నారు:
అమ్మకు ఆరోగ్యం బాగా లేని సమయంలో ఆమెను చూసేందుకు ప్రయత్నించిన కుదరలేదన్నారు అమృత. ఫోన్ చేసి తాను వస్తున్నానని చెబితే రావదన్నారని తెలిపారు. తాను ఇంట్లో ఉండట్లేదని తనతో చెప్పారని, వేద నిలయంలో కనుక్కుంటే ఇంట్లోనే వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిసిందని అన్నారు.

అవి చూస్తే తెలుస్తుంది:
తాను జయలలితను చాలాసార్లు కలిశానన్న దానికి సీసీ టీవి ఫుటేజీలే సాక్ష్యంగా నిలుస్తాయని అన్నారు. జెడ్ కేటగిరీ రిజిస్టర్ ను పరిశీలించినా ఈ విషయం బహిర్గతమవుతుందని తెలిపారు. అమ్మను కలవకుండా శశికళ తనను చాలాసార్లు అడ్డుకున్నారని ఈ సందర్భంగా అమృత ఆరోపించారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications