లైవ్ వీడియో కొంపముంచింది, చిన్న తప్పు కాదు, సస్పెన్షన్ వేటు
అసెంబ్లీలో తాను చేస్తోన్న ప్రసంగాన్ని ఫేస్ బుక్ లైవ్ లో ప్రసారం చేసిన అసోం కు చెందిన ఇస్లాం అనే ఎంఏల్ఏ మూడు రోజుల పాటు సస్పెన్షన్ కు గురయ్యారు.
గౌహతి:అసెంబ్లీలో తన ప్రసంగాన్ని అభిమానులకు చూపాలని భావించాడు ఓ ఎంఏల్ఏ. ఈ మేరకు తాను అసెంబ్లీలో చేస్తోన్న ప్రసంగాన్ని ఫేస్ బుక్ లైవ్ లో చూపాడు. ఎంఏల్ఏ వైఖరిపై స్పీకర్ కు ఫిర్యాదులు వెళ్ళడంతో ఆయనను మూడు రోజుల పాటు శాసనసభకు రాకుండా సస్పెండ్ చేశారు. ఈ ఘటన అసోం రాష్ట్రంలో చోటుచేసుకొంది.
అసోం రాష్ట్రంలోని ఎఐయూడిఎప్ ఎంఏల్ఏల అమినుల్ ఇస్లాం ఫిబ్రవరి మూడవ తేదిన అసెంబ్లీలో అక్రమ వలసలపై ప్రసంగించాడు. అయితే తన ప్రసంగాన్ని ఆయన తన అభిమానులకు చూపాలని భావించాడు.తాను ప్రసంగిస్తుండగా ఫేస్ బుక్ లైవ్ ఆఫ్షన్ ను ఎంచుకొన్నాడు.
అసెంబ్లీలో తాను ప్రసంగిస్తుండగా ఫేస్ బుక్ లైవ్ లో వస్తోంది. ఈ తతంగాన్ని గమనించిన ఇతర సభ్యులు స్పీకర్ కు ఇస్లాం పై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుతో పాటుగా వీడియో పుటేజీని కూడ స్పీకర్ కు అందజేశారు ఇతర సభ్యులు. ఈ ఫిర్యాదును ఎథిక్స్ కమిటీకి సిఫారస్లు చేశారు స్పీకర్. ఈ ఘటనపై విచారణ చేసి నివేదికను ఇవ్వాలని స్పీకర్ ఎథిక్స్ కమిటీని ఆదేశించారు.
శాసనసభ సంప్రదాయాలను ఉల్లంఘించేలా ఇస్లాం వ్యవహరించడాని ఎథిక్స్ కమిటీ అభిప్రాయపడింది. ఈ మేరకు తన నివేదికను కమిటీ స్పీకర్ కు ఇచ్చింది. ఈ కమిటీ సిఫారసుల ఆధారంగా ఇస్లాం నుండి మూడు రోజుల పాటు సభ నుండి సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.
అయితే తాను తప్పు చేశానని ఇస్లాం రాతపూర్వకంగా స్పీకర్ ను కోరారు. ఈ విషయమై క్షమాపణ కూడ కోరారు. అయితే ఇది చిన్నతప్పు కాదని స్పీకర్ వ్యాఖ్యానించారు.
అయితే ఈ నిర్ణయాన్ని ఆహ్వానిస్తూనే అసెంబ్లీ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఇస్లాం ప్రభుత్వాన్ని కోరారు. సభలో ఎవరు ఎలా మాట్లాడుతున్నారో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications