యూపీ ఎన్నికల తర్వాతే మందిరం -2023 డిసెంబర్ నుంచి భక్తులకు అయోధ్య రాముడి దర్శనం
దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తోన్న అద్భుత ఘట్టానికి ముహుర్తం దాదాపు ఖరారైంది. తన జన్మభూమి నుంచే శ్రీరాముడు జనానికి దర్శనమిచ్చే సమయం ఇంకెంత దూరంలోనూ లేదు.. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోదీ శిలాన్యాస్ చేసి నేటి(ఆగస్టు 5)కి ఏడాది పూర్తవుతోన్న సందర్భంగా రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక విషయాన్ని వెల్లడించింది. భూమి పూజ చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు ట్రస్ట్ సిద్దమవుతోంది.
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య పట్టణంలో 70 ఎకరాల సుదీర్ఘ విస్తీర్ణంలో నిర్మిస్తున్న రామమందిరం 2025 చివరికల్లా పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అంతకు రెండేండ్లు ముందుగా అంటే 2023, డిసెంబర్ నాటికి గర్భగుడి నిర్మాణం పూర్తవుతుందని, గర్భగుడి నిర్మాణం పూర్తయిన వెంటనే భక్తులకు ప్రవేశం కల్పిస్తారని అయోధ్య రామాలయ వర్గాలు వెల్లడించాయి. అంటే ఆలయ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. భక్తులు 2023 డిసెంబర్ నుంచి అయోధ్యలో పూజలు చేయవచ్చన్నమాట.

రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం ప్రధాని మోదీ గత ఏడాది ఆగస్టు 5న పునాది రాయి వేశారు. అయితే భారీగా వరదనీరు నిలువడంతో ఈ ఏడాది జనవరిలో పనులకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఆలయ పునాది నిర్మాణం జరుగుతున్నది. వచ్చే నెల 15 కల్లా పునాది నిర్మాణం పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అయోధ్యలో ఆలయంతో పాటు మ్యూజియం, డిజిటల్ ఆర్కైవ్లు, పరిశోధనా కేంద్రం కూడా నిర్మితమవుతోంది. దీనితో పాటు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రామ్ భక్తులకు పెద్ద ఆఫర్ ప్రకటించింది. రామ భక్తులందరూ ఇప్పుడు రామ మందిర నిర్మాణ పనులను అక్కడికి వెళ్లి చూడవచ్చు. దీని కోసం ఒక వ్యూపాయింట్ నిర్మించబడుతుంది. అయోధ్యకు వచ్చే భక్తులు ఆలయ నిర్మాణ పనులను తమ కళ్లతో చూడగలుగుతారు.
దీనిని గతంలో టెంట్లో కూర్చొని ఉన్న రామ్ లల్లాను దర్శించుకుని వచ్చేవారు. ఇప్పుడు ఆ ప్రాంతం పూర్తి స్థాయిలో దేవాలయంగా మార్చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. ఇప్పుడు రామ్ లల్లా భక్తులకు దర్శన దూరం కూడా తగ్గించబడింది. ఆలయ నిర్మాణానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తరపున దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో రామ మందిర నిర్మాణ కమిటీ నిర్మాణ పనులలో పూర్తిగా నిమగ్నమై ఉంది. కాగా,
ఉత్తరప్రదేశ్ లో ఇంకొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అయోధ్య ఆలయానికి సంబంధించిన వ్యవహారాలు కీలకంగా మారాయి. రాబోయే ఎన్నికల్లో బీజేపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్య నుంచే పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లోగా మందిరాన్ని పూర్తి చేయిస్తామని గతంలో బీజేపీ నేతలు చెప్పడం తెలిసిందే.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications