Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

174 మందితో వెళ్తున్న విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

రాంచీ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలోని 174 మంది ప్రయాణీకులు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

రాంచీ: రాంచీ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలోని 174 మంది ప్రయాణీకులు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

ఎయిర్ ఏసియాకు చెందిన విమానం బిర్సా ముండా ఎయిర్ పోర్ట్‌ నుంచి టేకాఫ్‌ అయ్యే సమయంలో ఓ పక్షి విమానాన్ని ఢీకొట్టింది.

Bird hits AirAsia flight, narrow escape for passengers

దీంతో పైలట్‌ అత్యవసర బ్రేక్‌ను ఉపయోగించి విమానాన్ని దించాడు. ఈ ఘటనలో విమాన బ్లేడ్లు దెబ్బతిన్నాయి. చుట్టూ పొగలు అలముకొన్నాయి.

అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ప్రయాణికులను ఎమర్జెన్సీ డోర్ ద్వారా కిందకు దింపేశారు. ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మూడు రోజుల క్రితం ఎయిర్‌ ఆసియా విమానానికి ప్రమాదం తప్పింది. ఓ వ్యక్తి విమానం గాల్లో ఉండగా ఒక్కసారిగా అత్యవసర ద్వారం తెరవబోయాడు. ఈ ఘటనకు బాధ్యుడైన వ్యక్తిని అరెస్ట్‌ చేసి అనంతరం మానసిక చికిత్స అందిచేందుకు ఆసుపత్రికి తరలించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+