వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
174 మందితో వెళ్తున్న విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
రాంచీ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలోని 174 మంది ప్రయాణీకులు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
రాంచీ: రాంచీ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలోని 174 మంది ప్రయాణీకులు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ఎయిర్ ఏసియాకు చెందిన విమానం బిర్సా ముండా ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యే సమయంలో ఓ పక్షి విమానాన్ని ఢీకొట్టింది.
దీంతో పైలట్ అత్యవసర బ్రేక్ను ఉపయోగించి విమానాన్ని దించాడు. ఈ ఘటనలో విమాన బ్లేడ్లు దెబ్బతిన్నాయి. చుట్టూ పొగలు అలముకొన్నాయి.
అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ప్రయాణికులను ఎమర్జెన్సీ డోర్ ద్వారా కిందకు దింపేశారు. ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మూడు రోజుల క్రితం ఎయిర్ ఆసియా విమానానికి ప్రమాదం తప్పింది. ఓ వ్యక్తి విమానం గాల్లో ఉండగా ఒక్కసారిగా అత్యవసర ద్వారం తెరవబోయాడు. ఈ ఘటనకు బాధ్యుడైన వ్యక్తిని అరెస్ట్ చేసి అనంతరం మానసిక చికిత్స అందిచేందుకు ఆసుపత్రికి తరలించారు.
Comments
English summary
The 174 passengers of an AirAsia flight had a narrow escape here in Jharkhand on Saturday, when the plane was hit by a bird as it was taking off. According to sources at Birsa Munda Airport, the flight's pilot used the emergency break to land the plane, which was going from Ranchi to New Delhi.
Story first published: Sunday, July 16, 2017, 10:58 [IST]