రెండు రోజులుగా బెంగాల్లో ఉద్రిక్తలు.. సోమవారం రాష్ట్ర్రవ్యాప్త బ్లాక్డే
పశ్చిమ బెంగాల్లో చెలరేగిన ఘర్షణలకు నిరసనగా బీజేపీ సోమవారం రాష్ట్ర్ర వ్యాప్త బ్లాక్ డేకు పిలుపునిచ్చింది.పశ్చిమ బెంగాల్లో చెలరేగిన ఘర్షణల్లో బీజేపీ కార్యకర్తలు నలుగురు మృతి చెందడంతో ఆరాష్ట్ర్రంలో ఉద్రిక్త వాతవరణం నెలకోంది. 24 పరగణ జిల్లాలో మొదలైన అల్లర్లు పలు ప్రాంతాలకు పాకాయి. ఈనేపథ్యంలోనే శనివారం జరిగిన అల్లర్లలో కార్యకర్తల మృతి చెందిన బీజేపీ కార్యకర్తల శవయాత్రను చేపట్టారు. అయితే ఈ శవయాత్రకు పోలీసులు అనుమతియలేదు. దీంతో ఈ సంఘటనపై బీజేపీ నేతలు పైర్ అయ్యారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిష్టి బొమ్మను తగులబెట్టారు.
మరోవైపు బీజేపీ ఎంపీలు గవర్నర్ కెశరీ నాథ్ త్రిపాఠీని కలిసి పరిస్థితిని వివరించారు. దీంతో ఎలాంటీ అల్లర్లు జరగకుండా చర్యలు చేపట్టాలని గవర్నర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. మరోవైపు అల్లర్ల కేంద్ర హోంశాఖ కూడ స్పందించింది. మమతా ప్రభుత్వానికి ఫోన్ చేసి లా అండ్ అర్డర్కు ఎలాంటీ విఘాతం కల్గకుండా చూసుకోవాలని చెప్పారు.

కాగా అల్లర్లను అదుపులోకి తీసుకురావాడానికి ఉత్తర 24 పరగణా జిల్లాల్లోని కార్యకర్తలకు ఘర్షణ చెలరేగిన సందేశ్ఖలి జిల్లాలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కాగా ఉత్తర 24 పరగణ జిల్లాలో జరిగిన ఘర్షణల్లో అటు బీజేపీతోపాటు తృణముల్ కార్యకర్తలు మృత్యువాత పడ్డారు. మరి కోందరు గాయాల పాలయ్యారు. దీంతో రెండు పార్టీల మధ్య రెండు రోజులుగా ఉద్రిక్త వాతవారణం నెలకోంది.












Click it and Unblock the Notifications