ఐదుగురి మృతి: బిజెపి ఎమ్మెల్యే, మాజీ ఎంపీలకు పదేళ్ల జైలు
పాట్నా: ఆందోళనలు సృష్టించి రెచ్చగొట్టి ఐదుగురి మరణానికి కారణం అయ్యారని బీజేపీ ఎంఎల్ఏ, ఇద్దరు మాజీ ఎంపీలతో సహ 14 మందికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది. 17 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం బీహార్ లోని సీతామడీ లోని కోర్టు ఈ తీర్పు చెప్పింది.
గురువారం న్యాయస్థానం బీహార్ లోని పరిహార్ బీజేపీ శాసన సభ్యుడు రాం నరేష్ యాదవ్, జేడీ (యు) మాజీ ఎంపీ నాథల్ కిశోర్ రాయ్, ఆర్జేడీ మాజీ ఎంపీ అన్వరుల్ హక్, ఆర్ఎల్ఎస్పీ నేతలు రాం కిషన్ సింగ్ కుశ్వాహ, మోహన్ కుమార్ సింగ్ తో సహ 14 మందికి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. మరో దోషి గన్ మ్యాన్ (పోలీస్) సూర్యదేవ్ రాయ్ కి ఐదు సంత్సరాల జైలు శిక్ష విధించారు.

1998లో బీహార్ లో భారీగా వరదలు వచ్చాయి. తరువాత సీతామడీ కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేశారు. అదే సందర్బంలో విధ్వంసం చోటు చేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు కాల్పులు జరిపారు.
ఈ కాల్పులలో ఐదుగురు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి న్యాయస్థానంలో నివేదిక సమర్పించారు. ఫాస్ట్ ట్రాక్ట్ కోర్టలో విచారణ జరిగింది. రెచ్చగొట్టడం వలనే విధ్వంసం జరిగిందని న్యాయస్థానం గుర్తించి వీరికి శిక్షలు విధించింది.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications