చెప్పలేం: నీరవ్ మోడీపై ఇండియాకు అమెరికా షాక్
Recommended Video

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్బి) కుంభకోణం కేసు ప్రధాన నిందితుడు నీరవ్ మోడీపై అమెరికా చేతులెత్తేసింది. నీరవ్ మోడీ తమ దేశంలో ఉన్నట్లు మీడియా వార్తలను బట్టి తెలుస్తోందని, అయితే దాన్ని ధృవీకరించలేమని అమెరికా విదేశాంగ శాఖ అదికార ప్రతినిధి శుక్రవారం అన్నారు.
నీరవ్ మోడీ న్యూయార్క్లో ఉన్నట్లు వచ్చిన వార్తాకథనాలపై పిటిఐతో ఆవిధంగా అన్నారు. నీరవ్ మోడీ ఆచూకీ కనిపెట్టడానికి భారత ప్రభుత్వానికి సాయం అందిస్తారా అని అడిగితే, నీరవ్ మోడీ దర్యాప్తునకు సంబంధించి భారత అధికారులకు న్యాయ సహాయం అందించే విషయం న్యాయశాఖ చూసుకుంటుందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అన్నారు.

అయితే, మోడీపై వ్యాఖ్యానించడానికి జస్టిస్ డిపార్ట్మెంట్ నిరాకరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ు 12 వేల కోట్ల రూపాయల మేరకు ముంచిన కేసులో నీరవ్ మోడీని, ఆయన మామ మెహుల్ చోక్సీని విచారించాలని సిబిఐ భావిస్తోంది.
నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ జనవరి మొదటివారంలో భారతదేశం వదిలి పారిపోయారు. వారి కోసం సిబిఐ అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. తాను వ్యాపార కార్యకలాపాల్లో బిజీగా ఉన్నందున విచారణ నిమిత్తం ఇండియాకు రాలేనని నీరవ్ మోడీ చెప్పారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!












Click it and Unblock the Notifications