కేసుల కేటాయింపులో నిర్ణయాధికారం 'సీజేఐ'దే: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: బెంచ్ల ఏర్పాటు, కేసుల కేటాయింపు విషయంలో సుప్రీం చీఫ్ జస్టిస్ నిర్ణయాధికారాలను సవాల్ చేస్తూ మాజీ అడ్వకేట్ అశోక్ పాండే దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం తోసిపుచ్చింది.
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, డీవై చంద్రచూద్ లతో కూడిన ధర్మాసనం పిటిషనర్ వాదనను తప్పుపట్టింది.

కేసుల కేటాయింపు విషయంలో పూర్తి నిర్ణయాధికారం 'చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా'(సీజేఐ)కు ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, కేసుల కేటాయింపుకు సంబంధించి సీజేఐ అపెక్స్ కోర్టులోని ఇద్దరు సీనియర్ న్యాయవాదుల సలహాలు-సూచనలు కూడా స్వీకరించాలని అశోక్ పాండే తన పిటిషన్లో పేర్కొన్నారు.
అశోక్ పాండే పిటిషన్ పై లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన న్యాయమూర్తి చంద్రచూద్ 'సమకాలీన న్యాయవాదుల్లో భారత ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంటారు. కేసుల కేటాయింపు, బెంచ్ల ఏర్పాటులో ఆయనకే నిర్ణయాధికారం ఉంటుంది' అని అందులో తెలిపారు.
కాగా, సుప్రీం కోర్టులో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటూ.. గత జనవరి నెలలో నలుగురు సుప్రీం న్యాయవాదులు దేశ చరిత్రలోనే తొలిసారిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది.
నాలుగు రోజుల క్రితమే సీజేఐ నిర్ణయాధికారాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ మాజీ న్యాయశాఖ మంత్రి, సీనియర్ అడ్వకేట్ శాంతిభూషణ్ కూడా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications