తిరిగి వస్తారని: 6వారాలుగా డీప్ ఫ్రీజర్లో మృతదేహం

కాగా అప్పట్నుంచి అతని మృతదేహాన్ని శిశ్యులు డీప్ ఫ్రీజర్లో ఉంచుతున్నారు. పంజాబ్ రాష్ట్రంలోని నుర్మహల్ పట్టణంలో విస్తరించిన ఆశ్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా మహరాజ్ గురు.. దివ్య జ్యోతి జాగృతి సంస్థాన్కు నాయకత్వం వహిస్తున్నారని అనుచరులు చెప్పారు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అనుచరులు ఉన్నారని తెలిపారు.
ఆశ్రమ సంస్థ ప్రతినిధి స్వామి విశాలానంద్ మాట్లాడుతూ.. తమ గురువు అషుతోష్ మహరాజ్ చనిపోలేదని, సమాధిలో ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం తమ గురువు గాఢమైన ధ్యానంలో ఉన్నారని, ఆయన చేతన స్థితిలోనే ఉన్నారని తెలిపారు. ఆయన అనుచరులంతా ధ్యానం నుంచి ఎప్పుడు బయటికి వస్తారా అని ఎదురు చూస్తున్నారని విశాలానంద్ చెప్పారు. అప్పటి వరకు ఆశ్రమం తెరిచే ఉంటుందని, అనుచరులు, శిశ్యులు తమ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధ్యానం కొనసాగిస్తారని తెలిపారు.
తమ గురువు ధ్యాన స్థితిలో నుంచే శిశ్యులకు సూచనలు చేస్తున్నారని, ఆయన తిరిగి వచ్చే వరకూ తన శరీరాన్ని కాపాడాలని చెప్పారని విశాలానంద్ తెలిపారు. కాగా అషుతోష్ మహరాజ్ మృతదేహాన్ని డీప్ ఫ్రీజర్ ఉంచడంపై స్వామిజీ మాజీ డ్రైవర్ కోర్టును ఆశ్రయించాడు. గురువు ఆస్తిలో వాటా కోసమే ఆయన మృతదేహాన్ని డీప్ ఫ్రీజర్ ఉంచుతున్నారని ఆయన అనుచరులపై ఆరోపణలు కూడా చేసినట్లు తెలిసింది. అయితే స్వామిజీ మృతి చెందాడని అధికార వర్గాలు ధృవీకరించడంతో కోర్టు అతని పిటిషన్ను తిరస్కరించినట్లు పంజాబ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రీతా కోహ్లీ తెలిపారు.
మహరాజ్ గురు శరీరాన్ని తమతోనే ఉంచుకోవాలని ఆశ్రమంలోని అతని అనుచరులు నిర్ణయించుకున్నట్లు కోహ్లీ చెప్పారు. ఈ కేసు కోర్టులో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని జిల్లా పోలీసు ఉన్నతాధికారి గురిందర్ సింగ్ దిల్లన్ తెలిపారు. 19883లో అషుతోష్ మహారాజ్చే ఈ ఆశ్రమం స్థాపించబడిందని, ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు, అనుచరులు ఉన్నారని స్వామిజీకి సంబంధించిన వెబ్సైట్ పేర్కొంటుంది. కాగా స్వామిజీ తిరిగి వస్తారని, కళ్లు మూసుకుని ధ్యానం చేస్తే అతను తమతో మాట్లాడుతాడని స్వామిజీ భక్తులు చెబుతున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications