అన్నాడీఎంకే, ఆ పార్టీ జెండాను కాపాడేది నేనే: జయలలిత మేనకోడలు దీపా, ఈసీకి లేఖ!
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ, ఆ పార్టీ రెండాకుల చిహ్నం తానే కాపాడుతానని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా అన్నారు. జయలలిత ప్రాణాలను ఫలంగా పెట్టి అన్నాడీఎంకే పార్టీని కాపాడుకుంటూ వచ్చారని దీపా చెప్పారు.
జయలలిత వేలిముద్రలు, ఎన్నికల్లో పోటీ, ఎన్నికల కమిషన్ కు నోటీసులు ఇచ్చిన హైకోర్టు!
చెన్నైలో ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై అధ్యక్షురాలు జే. దీపా మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే పార్టీని ఎంజీఆర్ స్థాపించారని, ఆయన తరువాత 2016 చివరికి వరకూ ఆ పార్టీని జయలలిత కాపాడుకుంటూ వచ్చారని దీపా అన్నారు. అయితే జయలలిత మరణించిన తరువాత పార్టీ ముక్కలు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పేదల కష్టాలు తీర్చడానికి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జయలలిత తమిళనాడు ప్రజలకు ఎనలేని సేవ చేశారని గుర్తు చేశారు. అయితే కొందరు స్వార్థంతో పార్టీని నాశనం చెయ్యడానికి సిద్దం అయ్యారని జయలలిత మేనకోడలు దీపా ఆవేదన వ్యక్తం చేశారు.
420, ఫోర్జరీ ఎవరో ప్రపంచానికే తెలుసు, మోడీ ఇంటి ముందే శశికళ ఫ్యామిలీకి సీఎం వార్నింగ్ !
అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం తానే కాపాడుకుంటానని దీపా ధీమా వ్యక్తం చేశారు. అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితుల నుంచి అన్నాడీఎంకేని చెక్కబెట్టేందుకు వెంటనే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు జరిపించాలని దీపా ఎన్నికల కమిషన్ కు వినతి పత్రం సమర్పించారు.