అన్నాడీఎంకే, ఆ పార్టీ జెండాను కాపాడేది నేనే: జయలలిత మేనకోడలు దీపా, ఈసీకి లేఖ!
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ, ఆ పార్టీ రెండాకుల చిహ్నం తానే కాపాడుతానని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా అన్నారు. జయలలిత ప్రాణాలను ఫలంగా పెట్టి అన్నాడీఎంకే పార్టీని కాపాడుకుంటూ వచ్చారని దీపా చెప్పారు.
చెన్నైలో ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై అధ్యక్షురాలు జే. దీపా మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే పార్టీని ఎంజీఆర్ స్థాపించారని, ఆయన తరువాత 2016 చివరికి వరకూ ఆ పార్టీని జయలలిత కాపాడుకుంటూ వచ్చారని దీపా అన్నారు. అయితే జయలలిత మరణించిన తరువాత పార్టీ ముక్కలు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పేదల కష్టాలు తీర్చడానికి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జయలలిత తమిళనాడు ప్రజలకు ఎనలేని సేవ చేశారని గుర్తు చేశారు. అయితే కొందరు స్వార్థంతో పార్టీని నాశనం చెయ్యడానికి సిద్దం అయ్యారని జయలలిత మేనకోడలు దీపా ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం తానే కాపాడుకుంటానని దీపా ధీమా వ్యక్తం చేశారు. అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితుల నుంచి అన్నాడీఎంకేని చెక్కబెట్టేందుకు వెంటనే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు జరిపించాలని దీపా ఎన్నికల కమిషన్ కు వినతి పత్రం సమర్పించారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications