పోలీసులకు, మావోయిస్టులకు కాల్పులు, ఏడుగురు మావోల మృతి
బస్తర్ : పోలీసులకు మావోయిస్టులకు జరిగిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. ఛత్తీస్ గఢ్లోని బస్తర్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలింది. మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. వారు తారసపడటంతో కాల్పులు ప్రారంభమయ్యాయని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
బస్తర్ జిల్లా జగదల్ పూర్లో సాయంత్రం ఎదురుకాల్పులు జరిగాయి. తిరియా గ్రామ సమీపంలో ఇరువర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. ఆ వెంటనే భద్రతాదళాలు మెరుపుదాడి చేయడంతో .. మావోయిస్టులకు పెద్ద దెబ్బ తగలింది. మావోయిస్టులు నక్కి ఉన్నారనే సమాచారంతో జిల్లా రిజర్వ్ గార్డ్, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ దళాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. మావోయిస్టులు కనిపించిన వెంటనే కాల్పులు ప్రారంభించాయి.

దీంతో ఇరు వర్గాలు కాల్పులు జరుపడంతో ఆ ప్రాంతమంతా తుపాకుల మోతతో దద్దరిల్లిపోయింది. కాల్పులు ముగిసిన తర్వాత ఘటనాస్థలం నుంచి పోలీసులు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వారిని గుర్తించాల్సి ఉంది. భారీగా ఆయుధాలను కూడా లభించినట్టు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. బస్తర్లో కాల్పులతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. ఎన్ కౌంటర్ తర్వాత పోలీసులు తనిఖీలను విసృతం చేశారు. రహదారి గుండా వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications