ఇంటిపేరు తెచ్చిన తంటా, షిండే కుటుంబంపై తప్పుడు ప్రచారం
ఏ మాత్రం సంబంధం లేని కేసులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే కుటుంబాన్ని, ఆయన రెండో కుమార్తె ప్రీతిష్రాఫ్ ను సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు.ప్రీతి ఇంటిపేరు ష్రాఫ్ కలిగిన మరో మహిళ చేసిన
ముంబై: ఏ మాత్రం సంబంధం లేని కేసులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే కుటుంబాన్ని, ఆయన రెండో కుమార్తె ప్రీతిష్రాఫ్ ను సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు.ప్రీతి ఇంటిపేరు ష్రాఫ్ కలిగిన మరో మహిళ చేసిన తప్పును సుశీల్ కుమార్ రెండో కుమార్తె చేసినట్టుగా భావించి నెటిజన్లను మేసేజ్ లు పెట్టారు.
చిన్నపొరపాటు కారణంగా చేయని తప్పుకు సోషల్ మీడియాలో నెటిజన్లు సుశీల్ కుమార్ షిండే రెండో కుమార్తె ప్రీతిష్రాఫ్ బలైంది.సోషల్ మీడియాలో వచ్చిన వదంతులు షిండే కుటుంబంలో కలకలం రేపాయి.

చివరకు ప్రీతి, ఆమె భర్త మీడియా ముందుకు వచ్చిన వివరణ ఇవ్వడంతో తప్పుడు ప్రచారానికి పుల్ స్టాప్ పడింది. గత సోమవారంనాడు పూణెలో కారు నడుపుతూ వెళ్ళుతున్న ఓ మహిళ పుట్ పాత్ పై నిల్చున్న వారిని ఢీకొట్టింది.దీంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రీతి పుట్ పాత్ పై ఉన్నవారిపై కారు నడిపి ఇద్దరి మరణానికి కారణమయ్యారంటూ సోషల్ మీడియాలో మేసేజ్ లు పంపారు. ఏం జరిగిందంటూ షిండే కుటుంబసభ్యుల స్నేహితులు ఆరా తీశారు. ఈ పుకార్లు విని షిండే కుటుంబసభ్యులు షాకయ్యారు.
కాంగ్రెస్ నేత , వ్యాపారవేత్త రాజ్ ష్రాఫ్ ను ప్రీతి వివాహం చేసుకొన్నారు. ఈ ప్రచారంపై ఏ రకంగా స్పందించాలో అర్ధం కావడం లేదని రాజ్ అన్నారు.ఏం జరిగిందో తెలుసుకోకుండా ప్రమాదానికి కారణం ఎవరో తెలుసుకోకుండా తమపై సోషల్ మీడియాలో ఎవరు ఎందుకిలా తప్పుడు ప్రచారం చేశారు? కనీసం పేపర్లో వచ్చిన వార్తను కూడ చదవకుండా తమపై నిందలు వేస్తారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఈ దుష్ప్రచారాన్ని ఆపి, నిందితులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పూణె పోలీస్ కమిషనర్ ను ఆయన కోరారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications