అలా అయితే.. దేశం విడిచి వెళ్లిపోవచ్చు: అన్సారీపై ఆర్ఎస్ఎస్ సంచలన కామెంట్స్!
దేశంలోని ముస్లింలు అభద్రతా భావంలో ఉన్నారన్న హమీద్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. అలా అయితే ముస్లింలు తమకు సురక్షితం అనిపించే మరో దేశానికి నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చునని అన్నారు.
న్యూఢిల్లీ: మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీపై ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత ఇంద్రేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లింలు అభద్రతా భావంలో ఉన్నారన్న హమీద్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. అలా అయితే ముస్లింలు తమకు సురక్షితం అనిపించే మరో దేశానికి నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చునని అన్నారు.
ఉపరాష్ట్రపతిగా వైదొలుగుతున్న సమయంలో హమీద్ అన్సారీ ముస్లింల భద్రతపై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇంద్రేష్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన తనకు ఎక్కడ పూర్తి స్వేచ్చ, భద్రత లభిస్తాయని భావిస్తారో అక్కడికి వెళ్లిపోవచ్చునని అన్నారు.

అన్సారీ సహా అభద్రతా భావంలో ఉన్న భారతీయ ముస్లింలంతా సురక్షితంగా ఉన్న దేశం పేరు వెల్లడించి, ఇక్కడి నుంచి నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చునని ఇంద్రేష్ అన్నారు. నాగ్ పూర్ లో జరిగిన ఓ ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
హమీద్ అన్సారీ వ్యాఖ్యలను దేశంలో ఎవరూ విశ్వసించడం లేదని కూడా ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. పదేళ్లుగా లౌకిక వాదిగా ఉన్న అన్సారీ పదవీ విరమణ చేయగానే కుహనా లౌకికవాదిగా మారారని విస్మయం వ్యక్తం చేశారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications