అలా అయితే.. దేశం విడిచి వెళ్లిపోవచ్చు: అన్సారీపై ఆర్ఎస్ఎస్ సంచలన కామెంట్స్!
దేశంలోని ముస్లింలు అభద్రతా భావంలో ఉన్నారన్న హమీద్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. అలా అయితే ముస్లింలు తమకు సురక్షితం అనిపించే మరో దేశానికి నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చునని అన్నారు.
న్యూఢిల్లీ: మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీపై ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత ఇంద్రేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లింలు అభద్రతా భావంలో ఉన్నారన్న హమీద్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. అలా అయితే ముస్లింలు తమకు సురక్షితం అనిపించే మరో దేశానికి నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చునని అన్నారు.
ఉపరాష్ట్రపతిగా వైదొలుగుతున్న సమయంలో హమీద్ అన్సారీ ముస్లింల భద్రతపై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇంద్రేష్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన తనకు ఎక్కడ పూర్తి స్వేచ్చ, భద్రత లభిస్తాయని భావిస్తారో అక్కడికి వెళ్లిపోవచ్చునని అన్నారు.

అన్సారీ సహా అభద్రతా భావంలో ఉన్న భారతీయ ముస్లింలంతా సురక్షితంగా ఉన్న దేశం పేరు వెల్లడించి, ఇక్కడి నుంచి నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చునని ఇంద్రేష్ అన్నారు. నాగ్ పూర్ లో జరిగిన ఓ ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
హమీద్ అన్సారీ వ్యాఖ్యలను దేశంలో ఎవరూ విశ్వసించడం లేదని కూడా ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. పదేళ్లుగా లౌకిక వాదిగా ఉన్న అన్సారీ పదవీ విరమణ చేయగానే కుహనా లౌకికవాదిగా మారారని విస్మయం వ్యక్తం చేశారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications