కర్ణాటక సీఎం కుర్చీలో నేడు కుమారస్వామి, 25న బలపరీక్ష, 29న మంత్రి వర్గం, అసమ్మతి దెబ్బ!
Recommended Video

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్.డి.కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా హెచ్.డి.కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రిగా కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి. పరమేశ్వర్ మాత్రమే బుధవారం ప్రమాణస్వీకారం చేస్తున్నారు. పూర్తి మంత్రి వర్గం ప్రమాణస్వీకారం చెయ్యడానికి వారం రోజులు (మే 29) గడువు విధించారు. అసమ్మతి దెబ్బతో వారం రోజులు సమయం తీసుకుంటున్నారని సమాచారం.

కాంగ్రెస్, జేడీఎస్ చర్చలు
బెంగళూరు నగరంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన నాయకులు సుదీర్ఘంగా చర్చలు జరుపుతూనే ఉన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల పంపకంపై రెండు పార్టీల నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు.

కుమారస్వామికి కోత
కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఎన్ని మంత్రి పదవులు పంచుకోవాలి అంటూ చర్చలు జరిపారు. కాంగ్రెస్ కు 20 మంత్రి పదవులు ఇవ్వాలని మొదట నిర్ణయించారు. ముఖ్యమంత్రితో పాటు 13 మంత్రి పదవులు, స్పీకర్ పదవి ఇవ్వాలని జేడీఎస్ డిమాండ్ చేసింది. అయితే చివరి నిమిషయంలో కుమారస్వామి కోరికకు కోత పడింది. కాంగ్రెస్ కు 22 మంత్రి పదవులు, జేడీఎస్ కు 12 మంత్రి పదవులు వస్తున్నాయి.

కాంగ్రెస్, జేడీఎస్ లెక్క
బెంగళూరులో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి. పరమేశ్వర్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ కేసీ. వేణుగోపాల్, జేడీఎస్ పార్టీ నుంచి హెచ్.డి. కుమారస్వామి, హెచ్.డి. రేవణ్ణలు చర్చలు జరిపారు.

రెండోసారి రమేష్ కుమార్
కర్ణాటక స్పీకర్ గా కర్ణాటక- ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని శ్రీనివాసపురం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రమేష్ కుమార్ ను నియమిస్తున్నారు. స్పీకర్ నియామకంపై కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఓ అంగీకారానికి వచ్చాయి. గతంలో రమేష్ కుమార్ స్పీకర్ గా, మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.

మే 29వ తేది మంత్రులు
కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేస్తున్న హెచ్.డి. కుమారస్వామి మే 25వ తేదీ శుక్రవారం అసెంబ్లీలో బలపరీక్షలో మెజారిటీ నిరూపించుకోవడానికి సిద్దం అయ్యారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు కూడకట్టుకుని బలపరీక్షలో విజయం సాధించి మే 29వ తేదీ బుధవారం మంత్రి వర్గంతో ప్రమాణస్వీకారం చేయించాలని హెచ్.డి. కుమారస్వామి, కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications