లష్కరే తొయిబాలో కొత్త విభాగం: ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన జవాన్లు
జమ్మూ: జమ్మూ కాశ్మీర్లో లష్కరే తొయిబా ఉగ్రవాదులు, ఆర్మీ జవాన్ల మధ్య భీకర ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ తెల్లవారు జాము వరకూ ఎదురు కాల్పులు కొనసాగాయి. షోపియాన్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఎదురు కాల్పుల్లో జవాన్లు.. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. సోమవారం చోటు చేసుకున్న ఎన్కౌంటర్లోో అయిదుమంది జవాన్లు వీరమరణం పొందారు. దీనికి ప్రతీకారాన్ని తీర్చుకుంది సైన్యం. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. సంఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకుంది.
#ShopianEncounterUpdate: Out of 03 killed #terrorists, one terrorist has been identified as Mukhtar Shah of #Ganderbal, who shifted to #Shopian after killing one street hawker Virendra Paswan of Bihar: IGP Kashmir@JmuKmrPolice https://t.co/0vgygLxLpr
— Kashmir Zone Police (@KashmirPolice) October 11, 2021
సోమవారం తెల్లవారు జామున రాజౌరి సెక్టార్లో సంభవించిన ఎన్కౌంటర్లో అయిదుమంది జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. నియంత్రణ రేఖను దాటుకుని అక్రమంగా భారత్లోకి చొరబడటానికి ప్రయత్నించిన ఉగ్రవాదులపై సరిహద్దు భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో మన్దీప్ సింగ్, వైశాఖ్ హెచ్, జస్వీందర్ సింగ్, సరజ్ సింగ్, గజ్జన్ సింగ్ వీరమరణం పొందారు.

ఇప్పటికే కొందరు ఉగ్రవాదులు రాజౌరి సెక్టార్ మీదుగా అక్రమంగా కాశ్మీర్లోకి చొరబడినట్లు గుర్తించడంతో వారి కోసం వేట మొదలు పెట్టారు జవాన్లు. విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. షోపియాన్ శివార్లల్లో ఓ భవనంలో తలదాచుకున్నట్లు పక్కా సమాచారం అందింది. పెద్ద ఎత్తున జవాన్లు అక్కడికి చేరుకున్నారు. లొంగిపోవాల్సిందిగా హెచ్చరించారు. సైన్యం హెచ్చరికలను టెర్రరిస్టులు పట్టించుకోలేదు. కాల్పులకు దిగారు. దీనితో జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు.
కొన్ని గంటల పాటు ఈ కాల్పులు కొనసాగాయి. ఈ సందర్భంగా ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. వారిలో ఒకరిని ముఖ్తార్ షా గా గుర్తించారు. గండెర్బల్ నివాసిగా గుర్తించారు. బిహార్లో అతని మీద పలు కేసులు నమోదై ఉన్నట్లు కాశ్మీర్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ తెలిపారు. ఓ చిరు వ్యాపారిని హత్య చేశాడని చెప్పారు. అతని కోసం బిహార్ పోలీసులు గాలిస్తున్నారని అన్నారు. హత్యనేరం నమోదైన తరువాత అతను బిహార్ నుంచి జమ్మూ కాశ్మీర్కు వచ్చాడని చెప్పారు.
లష్కరే తొయిబాలో కొత్తగా ది రెసిస్టెన్స్ ఫోర్స్ అనే విభాగం ఏర్పాటైందని, ఇప్పుడు హతమైన ముగ్గురు ఉగ్రవాదులు కూడా ఈ విభాగానికి చెందినవారేనని పేర్కొన్నారు. ఈ రెసిస్టెన్స్ ఫోర్స్లో ఎంతమంది ఉన్నారనే విషయంపై ఆరా తీస్తున్నామని, ముగ్గురు ఉగ్రవాదుల కార్యకలాపాలు, వారికి ఉన్న ఇతర సంబంధాలపై దర్యాప్తు చేపట్టామని అన్నారు. ఈ రెసిస్టెన్స్ ఫోర్స్లో మరింత మంది ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు విజయ్ కుమార్ చెప్పారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications