330మందితో వెళ్తున్న జెట్ విమానానికి తప్పిన ముప్పు: వెంటొచ్చిన జర్మనీ యుద్ధ విమానాలు
జర్మనీ గగన తలంలో జెట్ ఎయిర్వేస్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది.
ముంబై: జర్మనీ గగన తలంలో జెట్ ఎయిర్వేస్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ముంబై నుంచి లండన్ వెళ్తున్న 9డబ్ల్యూ-118 విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి. ఆ సమయంలో విమానంలో 330 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నారు.
కొలగ్నె గగనతలంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఉగ్రవాదులు అదుపులోకి తీసుకున్నారేమోనని జర్మనీ అధికారులు ఆందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే స్పందించిన జర్మనీ వైమానిక దళం రెండు జెట్ ఫైటర్ విమానాలను భారత విమానానికి రక్షణగా గగనతలంలోకి పంపింది. ఈ విమానాలు భారత విమానం కమ్యూనికేషన్ను పునరుద్ధరించుకునేందుకు సహకరించాయి.
కొద్ది నిమిషాల తర్వాత సంబంధాలను పునరుద్ధరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో లండన్కు విమానం సురక్షితంగా చేరుకుంది. ఈ విషయాన్ని జెట్ ఎయిర్వేస్ అధికారప్రతినిధి ధ్రువీకరించారు. ఈ సమాచారాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులకు తెలియజేశారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications