Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

330మందితో వెళ్తున్న జెట్ విమానానికి తప్పిన ముప్పు: వెంటొచ్చిన జర్మనీ యుద్ధ విమానాలు

జర్మనీ గగన తలంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది.

ముంబై: జర్మనీ గగన తలంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ముంబై నుంచి లండన్‌ వెళ్తున్న 9డబ్ల్యూ-118 విమానానికి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఆ సమయంలో విమానంలో 330 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నారు.

కొలగ్నె గగనతలంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఉగ్రవాదులు అదుపులోకి తీసుకున్నారేమోనని జర్మనీ అధికారులు ఆందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే స్పందించిన జర్మనీ వైమానిక దళం రెండు జెట్ ఫైటర్ విమానాలను భారత విమానానికి రక్షణగా గగనతలంలోకి పంపింది. ఈ విమానాలు భారత విమానం కమ్యూనికేషన్‌ను పునరుద్ధరించుకునేందుకు సహకరించాయి.

కొద్ది నిమిషాల తర్వాత సంబంధాలను పునరుద్ధరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో లండన్‌కు విమానం సురక్షితంగా చేరుకుంది. ఈ విషయాన్ని జెట్ ఎయిర్‌వేస్ అధికారప్రతినిధి ధ్రువీకరించారు. ఈ సమాచారాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులకు తెలియజేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+