కుప్పకూలిన బొగ్గు గని: 10మంది మృతి, శిథిలాల కిందే 50మంది కార్మికులు
జార్ఖండ్ రాష్ట్రంలోని లాల్మాటియా వద్ద గురువారం అర్ధరాత్రి బొగ్గు గని కుప్పకూలింది.
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని లాల్మాటియా వద్ద గురువారం అర్ధరాత్రి బొగ్గు గని కుప్పకూలింది. గురువారం రాత్రి కార్మికులు విధులు మారుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. పది మంది మృతి చెందగా, శిథిలాల కింద మరో 50 మందికి పైగా కార్మికులు చిక్కుకున్నట్లు తెలిసింది.
సమాచారం తెలుసుకున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్దాస్ సహాయ చర్యలను చేపట్టాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. సహాయబృందాలు ఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగిస్తున్నాయి.

గాయపడిన వారిని ఉర్జానగర్ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం ధన్బాడ్, పాట్నాల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించాయి.
ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 10-12 యంత్రాలు, 40కి పైగా వాహనాలు గనిలో పనిచేస్తున్నాయని ఎస్పీ హిరాలాల్ చౌహాన్ తెలిపారు. ప్రస్తుతం గనిలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించడంపైనే దృష్టిపెట్టామని ఆయన వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
10మంది మృతదేహాల వెలికితీత
గనిలో చిక్కుకుపోయిన 10మంది కార్మికుల మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు బయటికి తీశాయి. కార్మికులను బయటికి తీసేందుకు సహాయక బృందాలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications