వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళ: సీఎం స్వస్ధలంలో బీజీపే కార్యకర్తను నరికి చంపారు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళలోని కన్నూర్‌ జిల్లాలోని పినరయిలో బీజేపీకి చెందిన ఓ కార్యకర్తను అత్యంత దారుణంగా హతమార్చారు. పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం 10 గంటల సమయంలో పినరయి గ్రామంలోని పెట్రోల్ బంకు వద్ద ఓ వ్యక్తిని నరికి చంపారు.

బాధితుడిని రెమిత్‌గా గుర్తించామని అన్నారు. బీజేపీ నేతగా ఉన్న రెమిత్ తండ్రి ఉతహ్మాన్‌‌ని కూడా సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇలానే హత్యకు గురయ్యారు. అయితే ఈ ఘటన కేరళ ముఖ్యమంత్రి విజయన్ సొంత పట్టణంలో జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Kerala: BJP worker hacked to death in CM Vijayan's hometown

దుండగులు ముసుగులో వచ్చి ఈ హత్య చేసి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన నేపథ్యంలో గురువారం కన్నూరు జిల్లాలో బీజీపే బంద్‌కు పిలుపునిచ్చింది. సోమవారం సీపీఎం సీనియర్ నాయకుడు కె. మోహనన్ (52) హత్యకు గురయ్యారు.

ఈ హత్య వెనుక ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన జరిగిన రెండో రోజే ఇదే జిల్లాకు చెందిన రెమిత్‌ అనే బీజేపీ కార్యకర్తను దారుణంగా నరికి చంపారు. ఈ రెండు ఘటనలతో బీజేపీ, సీపీఎం కార్యకర్తలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.

Kerala: BJP worker hacked to death in CM Vijayan's hometown

ఇదిలా ఉంటే కేరళలో ఇప్పుడున్న ప్రభుత్వ పాలనలో మే నుంచి ఇప్పటివరకు జరిగిన రాజకీయ దాడులకు సంబంధించి 300లకు పైగా కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ రెండు హత్యలు కూడా సీఎం పినరయి విజయన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మడామ్ నియోజకవర్గం పరిధిలోనే జరిగాయి.

English summary
A BJP activist was on Wednesday hacked to death in Pinarayi, Kannur district in Kerala. This is yet another incident which speaks about the violent politics that exists in Kerala today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X