ఉగ్రవాదులకు సహకరిస్తే..: ఆర్మీ చీఫ్ హెచ్చరిక, కాశ్మీర్లో ఉద్రిక్తత
ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమాల్లో సైన్యాన్ని అడ్డుకోవడం, జవాన్ల పైన రాళ్ల దాడికి పాల్పడే కాశ్మీర్ యువకులను ఇక ఏమాత్రం ఉపేక్షించబోమని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హెచ్చరించారు.
శ్రీనగర్: ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమాల్లో సైన్యాన్ని అడ్డుకోవడం, జవాన్ల పైన రాళ్ల దాడికి పాల్పడే కాశ్మీర్ యువకులను ఇక ఏమాత్రం ఉపేక్షించబోమని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హెచ్చరించారు. దీనిపై కాశ్మీర్లో పలువురు ఆందోళనకారులు రెచ్చిపోయారు.
శ్రీనగర్లో ఓ మసీదు వద్ద పాకిస్తాన్, ఐసిస్ జెండాలు పట్టుకొని కొందరు ఆందోళనకారులు నిరసన తెలిపారు. పోలీసుల పైన రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వ్యాఖ్యల పైన విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేయగా, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాత్రం కాంగ్రెస్ పైన ఎదురు దాడి చేశారు.

ఇలాంటి వ్యాఖ్యలు కాశ్మీర్ యువతలో శతృత్వ భావాలను పెంచుతాయని, ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు రాజకీయ పరిజ్ఞానం లేని మాటలు అని పలువురు అన్నారు. వారి వ్యాఖ్యల పైన కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఆగ్రహించారు.
కాగా, దేశభద్రతకు విఘాతం కలిగించి, అస్థిరతకు పాల్పడాలని భావించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. ఉగ్రవాదుల అణిచివేత చర్యలకు అడ్డుతగిలే వారిని విద్రోహ శక్తులుగా పరిగణించి కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications