Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టెక్కీలకు షాక్: ఐటీ సెక్టార్‌కు బ్యాడ్‌న్యూస్, రూపీ దెబ్బకు టీసీఎస్ ఢమాల్

ఐటీరంగానికి మరింత బ్యాడ్‌న్యూస్. గ్లోబల్ ఐటీ రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ మరోసారి ఐటీ వ్యయాల వృద్ది అంచనాలను తగ్గించింది. డిజిటైజేషన్ ఆందోళనతో 2.7 శాతంగా అంచనావేసిన వ్యయాల వృద్దిని 2017లో 2.4 శాతానికి తగ్

న్యూఢిల్లీ: ఐటీరంగానికి మరింత బ్యాడ్‌న్యూస్. గ్లోబల్ ఐటీ రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ మరోసారి ఐటీ వ్యయాల వృద్ది అంచనాలను తగ్గించింది. డిజిటైజేషన్ ఆందోళనతో 2.7 శాతంగా అంచనావేసిన వ్యయాల వృద్దిని 2017లో 2.4 శాతానికి తగ్గిస్తున్నట్టు పేర్కొంది.

తొలుత ప్రపంచవ్యాప్తంగా ఐటీ వ్యయాల వృద్ది 3 శాతంగా గార్ట్నర్ అంచనా వేసింది. తర్వాత దీన్ని ఈ ఏడాది జనవరి సమీక్షలో 2.7 శాతానికి కుదించింది. భవిష్యత్తు ఐటీ ఇండస్ట్రీ వృద్దిపై ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో గార్ట్నర్ రెండోసారి ఈ ఏడాదిలో వ్యయాల వృద్ది అంచనాలను తగ్గించేసింది.

భవిష్యత్తు ఐటీ ఇండస్ట్రీ వృద్దిపై అంచనాలు పడిపోవడంతోపాటు ఆటోమేషన్ నేపథ్యంలో గార్ట్నర్ రెండోసారి ఈ ఏడాదిలో వ్యయాల వృద్ది అంచనాలను తగ్గించేసింది.

అదేవిధంగా వ్యయాల వృద్ది అంచనాలు పడిపోవడంతో పాటు ఆటోమేషన్ పెనుముప్పులా ముంచుకొస్తుండడం , రక్షణాత్మక ధోరణి భారత్‌లో ఉద్యోగాల కోతపై భయాందోళనను కల్గిస్తున్నాయి.

 ఎగుమతుల వృద్దిని తక్కువే

ఎగుమతుల వృద్దిని తక్కువే

155 బిలియన్ డాలర్ల దేశీయ ఐటీ సెక్టార్ ఎక్కువగా ఎగుమతులపైనే ఆధారపడి ఉంది. నాస్కామ్ కూడ గత నెలలో 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల వృద్దిని తక్కువగా 7-8 శాతంగానే అంచనావేసింది. ప్రస్తుత వ్యాపారాలకు డిజిటల్ బిజినెస్‌లు లోతైన ప్రభావం చూపుతున్నాయని గార్ట్నర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ డేవిడ్ లవ్‌లాక్ ఓ ప్రకటనలో తెలిపారు.

2016 కంటే వృద్ది అంచనాలు ఎక్కువే

2016 కంటే వృద్ది అంచనాలు ఎక్కువే

డిజిటల్ బిజినెస్‌లు, కొత్త కేటగిరిలు, సాఫ్ట్‌వేర్ ప్లస్ సర్వీసెస్, మేథోసంపత్తి హక్కుల్లో వృద్దికి దోహదం చేస్తాయన్నారు. అయితే గార్ట్నర్ ప్రస్తుతం అంచనావేసిన వ్యయాల వృద్ది అంచనాలు 2016లో సాధించిన దానికంటే 0.3 శాతం వేగవంతంగానే ఉన్నాయి. ఇది ఇండస్ట్రీని 4.477 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్తోందని గార్ట్నర్ భావిస్తోంది.

 రూపీ దెబ్బకు టీసీఎస్ డౌన్

రూపీ దెబ్బకు టీసీఎస్ డౌన్

రూపాయి విలువ పెరగడంతో దేశీయ అతిపెద్ద టెక్నాలజీ దిగ్గజం టీసీఎస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 2017-18 ఆర్థిక సంవత్సర జూన్ త్రైమాసిక ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలను తప్పి క్వార్టర్ క్వార్టర్‌కు 10 శాతం పడిపోయింది. కంపెనీ నికరలాభాలు రూ.5,495 కోట్లుగా నమోదైందని కంపెనీ పేర్కొంది. కంపెనీ నికర లాభాలు రూ,6,203 కోట్లుగా ఉంటాయని విశ్లేషకులు అంచనావేశారు. కానీ, విశ్లేషకుల అంచనాలు తప్పాయి.

 భారీగా పడిపోయిన రెవిన్యూ

భారీగా పడిపోయిన రెవిన్యూ


రెవిన్యూ సైతం క్వార్టర్‌కు స్వల్పంగా 0.2 శాతం పడిపోయి రూ.29,584 కోట్లుగా నమోదయ్యాయి. ఇవి విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే వచ్చాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా ఒక్కో షేరుకు 7 రూపాయాల మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నట్టు ఈ ఐటీ దిగ్గజం ప్రకటించింది. ఈ క్వార్టర్‌లో డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయి విలువ పెరగడంతో రూ.650 కోట్లు నష్టపోయినట్టు కంపెనీ సిఎఫ్ఓ రామకృష్ణన్ ప్రకటించారు

 ఈబీఐటీ మార్జిన్లు 26.6 శాతానికి తగ్గుదల

ఈబీఐటీ మార్జిన్లు 26.6 శాతానికి తగ్గుదల

స్థిరమైన కరెన్సీ విలువల్లో రెవిన్యూ వృద్ది ఈ క్వార్టర్ లో 2 శాతం పెరిగింది. వాల్యూమ్ గ్రోత్ కూడ 3.5 శాతానికి పెరిగినట్టు కంపెనీ ఇవాళ బీఎస్ఈకి సమర్పించిన ఫైలింగ్ లో పేర్కొంది.గత క్వార్టర్ లో 29.10 శాతంగా ఉన్న ఈబీఐటి మార్జిన్లు ఈ క్వార్టర్‌లో 26.6 శాతానికి పడిపోయాయి. 1 మిలియన్ బ్యాండ్ లో కంపెనీ 8 మంది క్లయింట్లను చేర్చుకోగా, 10 మిలియన్ బ్యాండ్ లో 12 మంది ఉన్నారు. కంపెనీలో మొత్తం ఉద్యోగులు 3,85,809 ఉన్నారు. గ్రాస్ ఆడిక్షన్ కింద 11,202 ఉద్యోగులున్నారు. అయితే గత ఆర్థికసంవత్సరంతో పోలీస్తే నియామకాలు తక్కువగానే ఉన్నాయని కంపెనీ ప్రకటించింది

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+