నో శానిటైజర్: యూజ్ చేస్తే ప్రార్థన మందిరం అపవిత్రం, ఇమామ్, కమిటీలకు ఆదేశాలు..
కరోనా వైరస్ జడలువిప్పి నాట్యం చేస్తోంది. దేశంలో రోజుకు 10 వేల వరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయి. వైరస్ ప్రబలకుండా ఉండాలంటే.. ఇంటిపట్టునే ఉండాలి. లేదంటే మాస్క్ వేసుకొని, విధిగా శానిటైజర్ పెట్టుకోవాలి. కానీ నిన్న మధురలో కొన్ని ప్రముఖ ఆలయాలు.. దేవాలయం ముందర శానిటైజర్తో శుభ్రం చేసేందుకు నో చెప్పాయి. ఆ మరునాడే యూపీలో బరేలీ ఇస్లాం ప్రముఖులు కూడా వంతపాడారు. ఆల్కహాల్తో కూడిన శానిటైజర్ వాడటం వల్ల మసీదు ప్రాంగణం అపవిత్రం అవుతోందని.. ఇమామ్లు శానిటైజర్తో క్లీన్ చేయొద్దని సూచించారు.

నో శానిటైజర్..
ఆలయాలు, ప్రార్థన మందిరాలను ఆల్కహాల్తో కూడిన శానిటైజర్లతో శుభ్రపరచాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో వైరస్ వ్యాప్తి తగ్గుతోందని పేర్కొన్నది. కానీ ఆల్ ఇండియా తంజీమ్ ఉలామా ఏ ఇస్లాం మాత్రం దానిని తప్పుపడుతోంది. ప్రధాన కార్యదర్శి మౌలానా షాహబుద్దీన్.. ఆల్కహాల్తో కూడిన శానిటైజర్తో మసీదు ప్రాంగణాన్ని క్లీన్ చేయొద్దని పేర్కొన్నారు. పవిత్రమైన స్థలంలో ఇలా అపవిత్ర జలంతో శుభ్రపరచడం నిషిద్దం అని పేర్కొన్నారు.
Recommended Video

సబ్బు, షాంపు..
ప్రార్థన మందిరాలు క్లీన్ చేసేందుకు ఓకే.. కానీ శానిటైజర్తో కాకుండా సబ్బు, డిటర్జెంట్తో కూడా చేయొచ్చని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తాము గౌరవిస్తామని.. కానీ అదే సమయంలో తమ సంప్రదాయాలు, విలువలను మరచిపోమని తెలిపారు. ఆల్కహాల్తో కూడిన వస్తువులు గానీ మసీదుకు వచ్చేవారు తీసుకోవడం గానీ ఇస్లాంలో నిషిద్దం అని పేర్కొన్నారు. మసీదుకు వచ్చి ప్రార్థనలు చేసే వారు... ఇంటి వద్దే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అపవిత్రం
ఆల్కహాల్తో కూడిన శానిటైజర్ ఉపయోగిస్తే ఆ ప్రాంగణం అపవిత్రమైపోతుందని చెప్పారు. అపవిత్రమైన చోట ప్రార్థనలు చేయలేమని పేర్కొన్నారు. మసీదు ప్రాంగణంలో ఆల్కహాల్ పట్టుకున్న మహా పాపం అని చెప్పారు. అందుకే ఇమామ్, మసీదు కమిటీలు దీనిపై ఆలోచించాలని... సబ్బులు, షాంపులతో క్లీన్ చేయాలని మాత్రమే సూచించారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications