ఆధారాలు సరిపోవ్: ఈడీకి షాక్, సంతోషంలో మాల్యా?
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకుండా లండన్ పారిపోయిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మాజీ అధినేత విజయ్ మాల్యాకు భారీ ఊరట లభించింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఉద్దేశపూర్వకంగానే ఎగ్గొట్టిన మాల్యాను ఎలాగైనా తిరిగి భారత్కు రప్పించాలన్న ఈడీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
ఇంటర్ పోల్ ద్వారా విజయ్ మాల్యాకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని చూస్తున్న ఈడీకి నిరాశే ఎదురైంది. ఈ మేరకు ఈడీ అభ్యర్ధనపై ప్రాథమిక విచారణ చేపట్టిన ఇంటర్నేషనల్ పోలీసు ఆర్గనైజేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమర్పించిన సాక్ష్యాలు సరిపోవని తేల్చి చెప్పింది.
విజయ్ మాల్యాపై భారత ప్రభుత్వం ఎలాంటి నేరారోపణలను రుజువు చేయలేకపోయిందని ఇంటర్ పోల్ పేర్కొంది. ఈ క్రమంలో మాల్యాకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయలేమని చెప్పింది. అంతేకాదు భారత్ ప్రభుత్వం అభ్యర్ధనపై విజయ్ మాల్యా వివరణను ఇంటర్ పోల్ కోరనుంది.

ఇందుకోసం లండన్లో విజయ్ మాల్యా నివాసం ఉంటున్న ఎస్టేట్కు ఇంటర్ పోల్ డైరెక్టర్ను పంపించనున్నట్లు పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారాన్ని సమీక్షించేందుకు గాను తమకు రెండు నుంచి మూడు నెలలపాటు సమయం కావాలని కూడా భారత ప్రభుత్వాన్ని చెప్పినట్టుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
విజయ్ మాల్యాను ఈడీ నిందితుడిగా పేర్కొనడాన్ని కూడా ఇంటర్ పోల్ తప్పుబడుతోంది. విజయ్ మాల్యాను స్వదేశానికి పంపించాలని గతంలో యూకే ప్రభుత్వానికి భారత విదేశాంగ శాఖ లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన బ్రిటన్ ప్రభుత్వం విజయ్ మాల్యాను తమ దేశం నుంచి వెళ్లగొట్టలేమని స్పష్టం చేసింది.
యూకే చట్టాల ప్రకారం ఓ వ్యక్తిని దేశం నుంచి పంపించివేసే అధికారం తమకు లేదని బ్రిటన్ పోలీసులు స్పష్టంచేశారు. అయితే ఈ కేసు నిమిత్తం భారత్కు అవసరమైతే ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని యూకే అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మాల్యాకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఇంటర్ పోల్ను భారత ప్రభుత్వం కోరింది.
-
నాయకత్వాన్ని మలిచింది కుటుంబ విలువలే : కరణ్ అదానీ -
ట్రంప్కు తలనొప్పి.. పుతిన్కు పండగ!: భారత్, చైనాకు రష్యానే దిక్కు! -
భారత్ వృద్ధికి రూ.2 లక్షల కోట్లు..కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు -
హోటల్ యజమానులకు గుడ్ న్యూస్.. సబ్సిడీలతో సర్కార్ బంపర్ ఆఫర్! -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్ -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!!












Click it and Unblock the Notifications