వాన్నాక్రై ఎఫెక్ట్: దేశవ్యాప్తంగా ఏటీఎంల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా వాన్నాక్రై అల్లకల్లోలం సృష్టిస్తోంది. వాన్నాక్రై ప్రభావం బ్యాంకింగ్ నెట్ వర్క్ పైన పడకుండా ఆర్బీఐ తాజాగా చర్యలు చేపట్టింది.
ముంబై: ప్రపంచవ్యాప్తంగా వాన్నాక్రై అల్లకల్లోలం సృష్టిస్తోంది. వాన్నాక్రై ప్రభావం బ్యాంకింగ్ నెట్ వర్క్ పైన పడకుండా ఆర్బీఐ తాజాగా చర్యలు చేపట్టింది.
మాల్వేర్ నుంచి రక్షించేందుకు విండోస్ అప్డేషన్ వచ్చే వరకు అన్ని ఏటీఎంలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రభావంతో దేశవాప్తంగా భారీగా ఏటీఎంలు మూతపడనున్నాయి.
దేశంలో దాదాపు అన్ని ఏటీఎంలు విండోస్ ఆధారిత సాఫ్ట్వేర్తోనే పని చేస్తున్నాయి. వీటిల్లో అరవై శాతం అంటే 2.25లక్షల ఏటీఎంలు అవుట్డేటెడ్ విండోస్ ఎక్స్పీపైనే అధారపడుతున్నాయి.

ప్రస్తుతం మాల్వేర్ వ్యాపించిన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్స్పీ కూడా ప్రత్యేకమైన అప్డేట్ ఇస్తానని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బ్యాంకులు అత్యవసరంగా విండోస్ ప్యాచ్లను అప్డేట్ చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది.
దీంతో బ్యాంకులు తమ సర్వీసు ప్రొవైడర్లకు ఆదేశాలను జారీ చేశాయి. ఏటీఎం యంత్రాల్లో ఎటువంటి డేటా నిల్వ చేయడానికి అవకాశముండదని, కాబట్టి వాన్నక్రై బారిన పడే అవకాశముండదని అంటున్నారు. ఒకవేళ ఏటీఎం యంత్రాలు వాన్నాక్రై బారిన పడినా రీఫార్మాట్ చేసి వాడుకోవచ్చని అంటున్నారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications