కక్షకట్టిన పన్నీర్ సెల్వం: చివరి నిమిషంలో రద్దు, అయ్యా మీరే దిక్కు !
అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు విలీనం అయ్యే విషయంలో పన్నీర్ సెల్వం వాయిదా వేస్తూ వస్తున్నారు. గురువారం తన వర్గంతో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశం వాయిదా వేసిన పన్నీర్ సెల్వం సీఎం ఎడప్పాడి పళనిసామి వర్గీ
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం ఎడప్పాడి పళనిసామి వర్గానికి సినిమా చూపిస్తోంది. నిమిషనిమిషానికి ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఎడప్పాడి పళనిసామికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు.
గురువారం ఎడప్పాడి పళనిసామి వర్గం, పన్నీర్ సెల్వం వర్గం విలీనం అవుతాయని అందరూ భావించారు. ఆ దిశగానే పన్నీర్ సెల్వం గురువారం ఉదయం తన వర్గంతో అత్యవసర సమవేశం ఏర్పాటు చేశారు. తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి సైతం ఆయన ఇంటిలో సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో బిజీబిజీగా గడిపారు.

కక్షకట్టిన పన్నీర్ సెల్వం
శశికళ, ఆమె కుటుంబ సభ్వులను అన్నాడీఎంకే పార్టీ నుంచి బయటకు పంపించాలని కక్షకట్టుకున్న పన్నీర్ సెల్వం చివరికి తాను అనుకున్నది సాదించారు. ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వమే శశికళ, దినకరన్ ను పార్టీ నుంచి బహిష్కరించేలా ప్లాన్ చేసిన పన్నీర్ సెల్వం చివరికి సక్సస్ అయ్యారు.

పన్నీర్ సెల్వం రూటే సపరేటు
గురువారం ఉదయం తన వర్గంతో సమవేశం ఏర్పాటు చేసి విలీనంపై తుదినిర్ణయం తీసుకుంటామని పన్నీర్ సెల్వం చెప్పారు. అయితే గురువారం ఉదయం ఒక్క సారిగా అత్యవసర సమావేశం వాయిదా వేసిన పన్నీర్ సెల్వం వర్గం ఎడప్పాడి పళనిసామిని అయోమయంలో పడేశారు.

కొత్త డిమాండ్లు వస్తే ఏలా
పన్నీర్ సెల్వం తన వర్గీయులతో సమావేశం రద్దు చేసుకున్నారని, చర్చలు వాయిదా వేసుకున్నారని తెలుసుకున్న ఎడప్పాడి పళనిసామి వర్గం ఆందోళనకు గురైయ్యింది. ఇప్పుడు మళ్లీ పన్నీర్ సెల్వం కొత్త డిమాండ్లు తెరమీదకు తెస్తారా ? అంటూ పళనిసామి వర్గీయులు టెన్షన్ పడిపోతున్నారు.

శశికళ వర్గంలో ఎవ్వరికీ నో చాన్స్
అన్నాడీఎంకే రెండు వర్గాల విలీనం విషయంలో పన్నీర్ సెల్వం ఆలస్యం చెయ్యడానికి ఓ కారణం ఉందని తాజాగా వెలుగు చూసింది. శశికళను సీఎం చెయ్యాలని నినాదం తెరమీదకు తీసుకు వచ్చిన ముగ్గురు మంత్రులను దూరంపెట్టాలని షరత్తుపెట్టే అవకాశం ఉందని తెలిసింది.

హడలిపోతున్న మంత్రులు
ఐటీ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి, టీటీవీ దినకరన్ అనుచరుడు విజయభాస్కర్ ను కచ్చితంగా దూరం పెట్టడానికి సిద్దం అయ్యారు. ఆయనతో పాటు మరో ముగ్గురు మంత్రులను బయటకు పంపించడానికి రంగం సిద్దం అయ్యింది.

నేను సీఎంగా ఉంటే చిన్నమ్మకు జై అంటారా !
సీఎంగా ఉన్న సమయంలో బహిరంగంగా మీడియా ముందు తనను వ్యతిరేకించి, శశికళను సీఎం చెయ్యాలని పదేపదే నినాదాలు చేసిన ముగ్గరు మంత్రులకు ఉద్వాసన పలకాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేసే అవకాశం ఉందని ఆయన వర్గీయులు అంటున్నారు.

అందుకే వాయిదా వేస్తున్నారు
అన్నాడీఎంకేలో రెండు వర్గాలు విలీనం అయిన తరువాత ప్రభుత్వంలో పెత్తనం అంతా పన్నీర్ సెల్వం వర్గీయులదే ఉంటుందని స్పష్టంగా కనపడుతోంది. ఇప్పటికే తన అనచురులకు కీలక మంత్రి పదవులు ఇవ్వాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేశారు.

పన్నీర్ సెల్వమే దిక్కు
తమతో చేతులు కలపడానికి సిద్దం అయిన పన్నీర్ సెల్వం మాట విని శశికళ, దినకరన్ ను పార్టీ నుంచి బహిష్కరించిన ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం ఇప్పుడు అయోమయంలో పడిపోయింది. ప్రస్తుతం వారికి పన్నీర్ సెల్వం తప్ప వేరే ఎవ్వరూ దిక్కులేరని తెలుసుకున్నారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications